Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు అంచనాలను మించి పెరిగిపోతున్నాయి. కరోనా మొదటి దశలో అత్యధికంగా గతేడాది ఆగస్టు 25న 3,087 మందికి ఈ వ్యాధి సోకగా తాజాగా ఒక్క రోజులో 3,187 మంది దీని బారిన పడ్డారు. దీంతో గతేడాది అత్యధిక కేసుల రికార్డును ఇది అధిగమించింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు 1,15,311 మందికి పరీక్షలు చేశారు. వీరిలో 3,753 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఇదిలావుండగా 24 గంటల్లో కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 787 మాత్రమే. మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మొత్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,759కు చేరింది. జీహెచ్ఎంసీకి పరిమితమైనట్టు కనిపించినా గత కొన్ని రోజులుగా జిల్లాలను చుట్టేస్తున్నది. తాజాగా తొమ్మిది జిల్లాల్లో వందకు పైగా కేసులు నమోదు కావడం వ్యాప్తి వేగానికి అద్దం పడుతున్నది. జీహెచ్ఎంసీలో 551 మందికి, మేడ్చల్-మల్కాజిగిరిలో 333, రంగారెడ్డి 271, నిజామాబాద్ 251, నిర్మల్ 154, జగిత్యాల 134, సంగారెడ్డి 104, కామారెడ్డి 113, కరీంనగర్ లో 104 మంది వ్యాధి బారిన పడ్డట్టు గుర్తించారు.