Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ బడులు, మోడల్ స్కూళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.61.03 కోట్ల స్కూల్ గ్రాంట్ నిధులను విడుదల చేసింది. సెప్టెంబర్లో బడులు మూతపడిన తర్వాత రెండోవిడత నిధులు విడుదల చేస్తూ ఇటీవల సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ జి రమేష్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.42.90 కోట్లు, ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూళ్లకు రూ.18.13 కోట్ల నిధులు విడుదల చేశారు. వాటిలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలకు 75 శాతం స్కూల్ గ్రాంట్ రూ.57.34 కోట్లు, మోడల్ స్కూళ్లకు వందశాతం గ్రాంట్ రూ.1.45 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలకు రూ.2.23 కోట్లు విడుదల చేశామని వివరించారు.