Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ ఉగాది శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విప్లవ నామ తెలుగు నూతన సంవత్సరం (ఉగాది) సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కరోనా మహమ్మారిని అత్యంత ధైర్య సాహసాలతో ఎదుర్కోవటం ద్వారా కోవిడ్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలతోపాటు కోవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని కోరారు.