Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
సీఎం కేసీఆర్పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలను ఉద్దేశించి హెచ్చరిం చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం మంత్రి పలుచోట్ల అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా కాజీపేట నిట్లో మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో మాట్లా డారు. తెలంగాణ కోసం 14 ఏండ్లు ఉద్యమం చేసి రాష్ట్రం తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడుపుతుంటే.. స్థాయిలేని వ్యక్తులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము, పార్టీ కార్యక ర్తలు చూస్తూ ఊరుకోబోమన్నారు. బీజేపీ నేతలకు ఇదే చివరి హెచ్చరిక అన్నారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు పోస్టింగ్లు పెట్టినా ఊరుకోమ న్నారు. బీజేపీ దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తోం దన్నారు. సీఎం కేసీఆర్ లేకపోతే రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎక్కడివని ప్రశ్నించారు. ఎవరీ బండి సం జరు..? ఎవరీ ఉత్తమ్ ? అని ప్రశ్నించారు. మర్యా దగా మాట్లాడాలని, లేదంటే తాము మోడీని, అమిత ్షాను వదలబోమన్నారు. పని చేయని సన్నాసులే ఇన్ని మాట్లాడితే పనులు చేసిన వాళ్లు ఎంత మాట్లాడాలన్నారు. త్వరలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు. ఆత్మహత్యలతో సమ స్యలు పరిష్కారం కావని, ఎవరూ తొందరపడొద్దని సూచించారు. సునీల్ నాయక్ ఆత్మహత్యకు ముందు తీసిన వీడియోను పరిశీలిస్తే ఆయన్ను ఎంత రెచ్చగొట్టారో అర్థమవు తోందన్నారు. ఐఏఎస్ కావాల నుకున్నానని, నోటిఫికే షన్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు వీడి యోలో ఉందని, ఐఏఎస్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది కేంద్రంలోని యూపీఎస్సీ అని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. సునీల్ను ఎంత గంద రగోళం పెట్టారనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని చెప్పారు. దమ్ముంటే వరంగల్ నగరానికి గత ఆరేండ్లలో ఎన్ని నిధులు ఇచ్చామో తాము శ్వేతపత్రం విడుదల చేస్తామని, బీజేపీకి దమ్ముంటే వరంగల్కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏమయ్యాయని ప్రశ్నించారు. పర్యటనలను ఎందుకు అడ్డుకుంటు న్నరని అసహనం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాలపై మాట్లాడే హక్కు బీజేపీ నేతలకు లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ము కుంటున్న వారికి ఉద్యోగాల విషయం మాట్లాడే హక్కు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ మాట తప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడేండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షా 32 వేల 899 నియామకాలు చేశామని అసెంబ్లీలోనే ప్రకటించామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలు తీయా లని, చర్చ పెడదామని, ఎవరొస్తరో చూద్దామని అన్నారు. ఉత్తర్ప్రదేశ్ తెలంగాణ కంటే ఆరింతలు పెద్ద రాష్ట్రమని, అక్కడ 20వేల ఉద్యోగాలు ఇవ్వలేద ని, అలాంటి సీఎం యోగి ఇక్కడికొచ్చి మాట్లాడ తారని ఎద్దేవా చేశారు. గుజరాత్లో ఉద్యోగులకు 5 ఏండ్లు ప్రొబేషనరీ, మన దగ్గర 3 ఏండ్లు ప్రొబేషనరీ మాత్రమేనని తెలిపారు. సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.