Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గుర్తింపు పొందిన ప్రయివేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థిక సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.32 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ జీవో నెంబర్ 52 సోమవారం విడుదల చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో ప్రయివేటు స్కూళ్లలోని ఉపాధ్యాయులకు నెలకు రూ.2వేలు ఆర్థిక సహాయం, 25 కిలోల బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయానికి రూ.32 కోట్లు విడుదల చేసింది. ఈనెల నుంచి ప్రయివేటు టీచర్లకు ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రంలో 1.45 లక్షల మంది ఉపా ధ్యాయులు, సిబ్బంది ఉంటారని ప్రభుత్వం అంచనా వేసిన విషయం తెలిసిందే. వారంతా ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 20 నుంచి 24 వరకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.2 వేలు జమ అవుతాయనీ, 21 నుంచి 25 వరకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.