Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కోవిడ్ టీకా వేయించుకున్న జీహెచ్ఎంసీ, కార్పొరేషన్, మున్సిపల్, గ్రామపంచాయతీ ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన రెండు రోజుల సెలవు ఇవ్వాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఖమర్అలీ,పాలడుగు భాస్కర్,తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్,వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.గణపతిరెడ్డి, చాగంటి వెంకటయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు.