Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల ఎదుట నిందితుని లొంగుబాటు
నవతెలంగాణ-కూకట్పల్లి
పెండ్లి చేసుకోవాల్సిన తనతో కాకుండా ఇతరులతో తిరుగుతుందనే అనుమానంతో మరదలిని బావ హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని సంపులో వేశాడు. ఆ తరవాత అతనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. కానీ, ధైర్యం చాలక పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. కూకట్పల్లి ఏవీబీపురంలో ఉండే భూపతికి.. మూసాపేట్ హబీబ్నగర్లో నివాసముంటున్న సోమేశ్వరరావు-నీలమ్మ దంపతుల కుమార్తె మంజుల(19) మరదలు. ఆమె బీటెక్ చదువుతోంది. అయితే భూపతితో పెండ్లి కావాల్సి ఉంది. మంజుల మరో అబ్బాయితో క్లోజ్గా ఉంటోందని తెలిసి భూపతి నిలదీశాడు. ఆమె సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో తన ఇంటికి పిలిచి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృత దేహాన్ని ఇంట్లోని నీటి సంపులో వేశాడు. ఆ తర్వాత అతనూ చనిపోవాలను కున్నాడు.. కానీ, ధైర్యం చేయలేక కూకట్పల్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.