Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ దీక్ష
నవతెలంగాణ-అంబర్పేట
గతే డాది పంజాగుట్టలో దుం డగులు అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసినా ప్రభుత్వం ఇంత వరకూ చర్యలు తీసుకోవడం లేదని, వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని పునర్ ప్రతిష్టించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ బాగ్ అంబర్పేటలోని తన నివాసంలో నిరాహారదీక్షకు దిగారు.
మాల మహానాడు మద్దతు
వీహెచ్ దీక్షకు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు బోర్లకుంట దీపక్ కుమార్, పలు దళిత సంఘాలు మద్దతు పలికాయి. బోర్లకుంట దీపక్ కుమార్ మాట్లాడుతూ.. దళితులు, మహనీయులు అంటే తెలంగాణ ప్రభు త్వానికి, కేసీఆర్కు చిన్న చూపు ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆర్. లక్ష్మణ్ యాదవ్, పీసీసీ కార్యదర్శి శంబుల శ్రీకాంత్ గౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కోటం అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.