Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్కు కాంట్రాక్టు అధ్యాపకుల వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు 11వ పీఆర్సీ ప్రకారం మూలవేతనం అమలు చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కాంట్రాక్టు అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు. డీఏ, హెచ్ఆర్ఏ వర్తింపచేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం మంత్రి కె తారక రామారావును కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వస్కుల శ్రీనివాస్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్టు అధ్యాపకులకు బదిలీలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎ రమాదేవి, జి గణేష్, జి రాములు, ఈ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.