Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కదిలిన నీలిదండు
- రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
రాజ్యాంగ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నీలిదండు కదిలింది. కేవీపీఎస్ ఆధ్వర్యంలో నీలి రంగు టీషర్ట్స్ ధరించి కవాత్లు నిర్వహించారు. రిజర్వేషన్లు, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ కోసం పూలే, అంబేద్కర్ స్ఫూర్తితో ఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు. నల్లగొండలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్బాబు, సూర్యాపేటలో తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పున్నయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మతోన్మాద కాషాయ ఎజెండాను అమలు చేయడం కోసం రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్ర పన్నుతోందన్నారు. పూలే, అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్ముతోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, మహిళలపై హింస పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆవు పేరుతో దళితులు, మైనార్టీలపై దాడులు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని ఉపేక్షిస్తుందన్నారు. సబ్ప్లాన్ నిధులు దళిత సంక్షేమం కోసం ఖర్చు చేయడం లేదన్నారు.
కార్పొరేట్ శక్తుల సంపదను జాతీయం చేయాలి: జాన్వెస్లీ
దేశ ప్రజల సంపదను అక్రమంగా దోచుకున్న కార్పొరేట్ల సంపదను జాతీయం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లి డిమాండ్ చేశారు. హైదరా బాద్ గోల్కొండ క్రాస్ రోడ్డు నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకూ నీలిదండు కవాతు నిర్వహిం చారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ మొత్తం గ్రామ గ్రామా న ఫూలే, అంబేద్కర్ సందేశ యాత్రలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నట్టు తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలపరం చేసేలా చట్టాలను చేస్తోందని, రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు తెస్తూ.. ఎస్సీ ఎస్టీల హక్కులను కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యను ప్రయివేటుపరం చేస్తూ ఆధునిక మనుధర్మాన్ని అమలు చేస్తోందన్నారు. సామాజిక న్యాయాన్ని సమాధి చేసేవారికి ఫూలే, అంబేద్కర్ను స్మరించే హక్కు లేదన్నారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీ నుంచి పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు నీలిదండు కవాత్ నిర్వహించారు. కంది ఎంపీటీసీ నందకిషోర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జయరాజు జెండా ఊపి కవాత్ను ప్రారంభించారు. ఐబి దగ్గర నుంచి అంబేద్కర్ చిత్రపటంతో ఊరేగిం పుగా నీలి దండు కవాతు నిర్వహించి.. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళ్లర్పించారు. అనంతరం జరిగిన సభలో కెేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ఉండటం వల్లే దేశం ఐక్యంగా ఉన్నదన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీలిదం డు కవాతు ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కొత్త గాడి అంబేద్కర్ విగ్రహం నుంచి రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నీలి దండు కవాతు నిర్వహించారు. కుమురం భీం చౌక్ నుంచి అంబేద్కర ్చౌక్కు చేరుకొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఖమ్మం పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు బ్లూ టీ షర్ట్స్ ధరించి నీల్ కవాత్ నిర్వహించారు.