Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిగ్రీ, ఇంజినీరింగ్, బీసీఏ, బీబీఏ, బీబీఎంలో 50 శాతం మార్కులొస్తే అర్హులు
- మ్యాథ్స్కు 25 శాతం, సైన్స్కు 30 శాతం, సోషల్కు 45 శాతం సీట్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీఎడ్ రెండేండ్ల కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్సెట్ ఇకనుంచి కామన్ పరీక్ష ఉండనుంది. గతంలో మెథడాలజీ సబ్జెక్టు (మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, ఇంగ్లీష్, ఓరియంటల్ లాంగ్వేజెస్)కి ఒక పరీక్ష నిర్వహించే వారు. ఇప్పుడు ఆ పద్ధతికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. అన్ని మెథడాలజీలకు కలిపి ఒకే పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీఎడ్ ప్రవేశాలు, రాతపరీక్ష విధానంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ సోమవారం జీవో నెంబర్ 14 విడుదల చేశారు. 2017, మే 27న ఇచ్చిన జీవో నెంబర్ 13ను సవరించా మని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఎడ్సెట్ కమిటీ సమావేశం ఇందుకను గుణంగా నిర్ణయం తీసుకుందని వివరించారు. బీఎడ్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అర్హతల్లోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటి వరకు డిగ్రీలో చదివిన కోర్సుని బట్టి బీఎడ్లో ప్రవేశాలు కల్పించే అవకాశమున్నది. ఇక నుంచి ఇంటర్లో చేసిన గ్రూప్ని బట్టి ప్రవేశాలు కల్పిస్తారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) మార్గదర్శకాల మేరకు ఉన్నత విద్యామండలి చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ మార్పులు చేర్పులు చేసింది. డిగ్రీలో ఏ గ్రూప్ చేసినా 50శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన వారికే బీఎడ్లో ప్రవేశాలుంటాయి. ఇక ఇంజినీరింగ్లో ప్రస్తుతం 55 శాతం ఉన్న దాన్ని 50శాతం మార్కులకు తగ్గించారు. బీసీఏ చేసిన వారికి ఇంటర్లో చదివిన సబ్జె క్టుల మేరకు సంబంధిత మ్యాథ్స్ మెథడాలజీలో ప్రవేశం పొందే అవకాశం ఉంది. బీబీఏ చేసిన వాళ్లూ బీఎడ్ సోషల్స్టడీస్ మెథడాలజీలో ప్రవేశాలు పొందొచ్చు. కెమిస్ట్రీ ఒక్కటే చదివినా ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో బీఎడ్లో చేరేందుకు అవకాశమున్నది. ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేషన్తో డిగ్రీ చదివిన వారికి మాత్రమే ఇప్పటివరకు బీఎడ్ భౌతికశాస్త్రం మెథడాలజీలో ప్రవేశాలు కల్పించేవారు. ఇప్పుడు డిగ్రీలో కెమిస్ట్రీ ఒక్క సబ్జెక్ట్ చదివినా భౌతికశాస్త్రం మెథడాలజీగా తీసుకోవచ్చు. ఇటీవల భౌతికశాస్త్రం లేకుండా పలు కాంబినేషన్లతో కొత్త డిగ్రీ కోర్సులు అందుబాటులోకి వచ్చినందున ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది.