Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంకోల్లో 23.5 మిల్లీమీటర్ల వాన
- లక్ష్మిదేవిపల్లిలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రంగారెడ్డి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల ఈ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. వచ్చే మూడు రోజులు ఉరుములు మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకి 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో)పాటు వడగండ్లతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడొచ్చని పేర్కొంది. రాష్ట్రంలో భిన్నవాతావరణ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్లో అత్యధికంగా 23.5 మిల్లీమీటర్లు కామారెడ్డి జిల్లా గాందారిలో 21.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లిలో అత్యధికంగా 40.8సెల్సియస్ డిగ్రీల పగటిపూట ఉష్ణోగ్రత రికార్డయింది.
అత్యధిక వర్షపాతం నమోదైన ఐదు ప్రాంతాలు
కంకోల్ (సంగారెడ్డి) 23.5 మిల్లీమీటర్లు
గాందారి(కామారెడ్డి) 21.0 మిల్లీమీటర్లు
ధారూర్(వికారాబాద్) 19.3 మిల్లీమీటర్లు
కోహిర్(సంగారెడ్డి) 12.5 మిల్లీమీటర్లు
బుజరాంపేట(మెదక్) 11.3 మిల్లీమీటర్లు
అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ఐదు ప్రాంతాలు
లక్ష్మిదేవిపల్లి(భద్రాద్రికొత్తగూడెం) 40.8 డిగ్రీలు
అశ్వాపురం(భద్రాద్రి కొత్తగూడెం) 40.6 డిగ్రీలు
సత్యనారాయణపురం(భద్రాద్రి కొత్తగూడెం) 40.2 డిగ్రీలు
పెనుపల్లి (ఖమ్మం) 40.0 డిగ్రీలు
కుర్నవల్లి(ఖమ్మం) 40.0 డిగ్రీలు