Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాబాసాహెబ్ ఆంబేడ్కర్ అనబడే భీంరావ్ రాంజీ ఆంబేడ్కర్ మధ్య ప్రావిన్స్ (మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర)లో బ్రిటిష్ సైనికస్థావరం మ్హౌ (Military Headquarters Of Warfare-MHOW)లో 14.04.1891న జన్మించారు. బ్రిటిష్ సైన్యంలో సుబేదార్ రాంజీ మలోజీ సప్కాల్, భీమాబాయిల 14వ, ఆఖరి సంతానం. వీరిది మహార్ (దళిత) కులం. వీరి పూర్వీకులది నేటి మహారాష్ట్ర, రత్నగిరి జిల్లా, మందన్గడ్ తాలూకా, ఆంబాడవే పట్టణం. మధ్యప్రదేశ్ లో ఉన్న మ్హౌ ఆంబేడ్కర్ నగర్ గా మారింది. బాబాసాహెబ్ మరాఠీ పదబందానికి నాన్నగారు అని అర్థం. ఆంబేడ్కర్ పాఠశాల గది బయట తన గోనెసంచిపై కూర్చోవాలి. ''ఉన్నత'' కులస్తులు దోసిట్లోమంచినీళ్లు పోస్తే ఆంబేడ్కర్ తో సహా దళిత విద్యార్థులు తాగాలి.ఆంబేడ్కర్ తండ్రి కొడుకు పేరులో కులాన్ని సూచించే ఇంటిపేరు సక్పాల్ ను తొలగించి, 'ఆంబడవే' గ్రామవాసి అన్న అర్థంలో ఆంబడవేకర్ అని బడిలో ఇంటిపేరు మార్చారు.దేవరుఖే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు కష్ణాజి కేశవ్ ఆంబేడ్కర్ ఈ ఇంటిపేరును తన ఇంటిపేరు 'ఆంబేడ్కర్' గా మార్చారు. బ్రాహ్మణుల్లోనూబ్రాహ్మణత్వవ్యతిరేకులున్నారు. వారి పేదరికం, కష్టాలు, సామాజిక దష్టి వారికి పీడితజన పక్షపాత తాత్వికతను అందించాయి.
మేధావుల్లో అస్పశ్యతకు వ్యతిరేకంగా మాట్లాడనివారు, వివాదాంశం చేయనివారు లేరు. సంస్కరణసంస్థలను బ్రాహ్మణేతరులే స్థాపించారు. దళిత ఉద్యమాలకు ఇది ప్రధాన ప్రారంభ ఉత్ప్రేరకం. 1881లో బ్రాహ్మణేతర మరాఠాసాయాజీరావు గైక్వాడ్ బరోడా రాజు అయారు. 1883లో అణగదొక్కబడ్డవారి కోసం 18 ప్రత్యేక ఉచిత పాఠశాలలు స్థాపించారు. పలకలు, పెన్సిళ్లు, పుస్తకాలు ఉచితంగా అందించారు. తప్పనిసరి ప్రాథమిక విద్య ప్రవేశపెట్టారు. ఆంబేడ్కర్ అమెరికా, పాశ్చాత్య చదువులకు మొదట సహాయంచేసిన వ్యక్తి సాయాజీరావు గైక్వాడ్. బ్రాహ్మణేతర కులస్తుడు కాబట్టి ఈయన సంస్కరణలు చేపట్టారు, సహాయాలు చేశారు. మరొక బ్రాహ్మణేతర కొల్హాపుర్ మహారాజు సాహు ఛత్రపతి ఆంబేడ్కర్ కు లండన్ న్యాయశాస్త్ర చదువుకు సహాయపడ్డారు. ఈయన వెనుకబడ్డవారి విద్య కోసం కులానికి ఒకటి చొప్పున 'తక్కువ' కులాలవారికి, ముస్లింలకు, జైనులకు ఉచిత వసతిగహాలు స్థాపించారు. నాటి బ్రాహ్మణ రాజులు ఎవ్వరూ విద్యా సంస్థలు ప్రారంభించలేదు.
ఆంబేడ్కర్న్యాయశాస్త్రజ్ఞుడు, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, సంస్కర్త. దళిత ఉద్యమాన్ని ప్రభావితంచేశారు. అస్పశ్యత, సామాజిక వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడారు.ఈయన బ్రిటిష్ భారతంలో వైస్రారు కార్యనిర్వాహక మండలిలో కార్మిక మంత్రి. స్వతంత్ర భారత తొలి న్యాయశాఖా మంత్రి. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటి అధ్యక్షుడు. రాజ్యాంగ ముఖ్య నిర్మాత. కొలంబియా, లండన్ విశ్వవిద్యాలయాల నుండి ఆర్థికశాస్త్రంలో పరిశోధన పట్టాలు పొందిన రాజకీయశాస్త్రజ్ఞుడు. స్వాతంత్య్ర ఉద్యమ ప్రచారంలో, చర్చల్లో పాల్గొన్నారు.స్త్రీల,దళితుల రాజకీయ స్వేఛ్ఛ, రాజకీయహక్కులనుసమర్థిస్తూ, వాదిస్తూ విశేషకషిచేశారు. ఆంబేడ్కర్కుటుంబపోషణకు అనేక వత్తులు చేపట్టారు.బహుముఖ మేధావిఐనా దళితదమనవివక్షతఎదుర్కొన్నారు. బాంబే హైకోర్టులో వకీలుగా పనిచేస్తూనే దళితుల విద్యావ్యాప్తికి,సామాజిక ఆర్థిక ప్రగతికి, ఉన్నతీకరణకుపనిచేశారు.ఆ ఆశయసాధనకు బహిష్కత హితకారిణి సభ అన్న సంస్థను స్థాపించారు. దళిత హక్కుల రక్షణకు మూక నాయక్, బహిష్కత భారత్, సమానత్వ జనం వంటి పత్రికలునడిపారు. 1927లోఅస్పశ్యతకు వ్యతిరకంగా, అస్పశ్యులహక్కులు, తాగునీరు, దేవాలయ ప్రవేశం కోసం విస్తత స్థాయి ఉద్యమాలు చేపట్టారు. సత్యాగ్రహం చేశారు. 1930లో కాలరాం దేవాలయ ఉద్యమం చేపట్టారు. నాసిక్ లో 15 వేల మందితో క్రమశిక్షణతో ఊరేగింపు తీశారు. ఊరేగింపు గుడి దగ్గరకు వచ్చేసరికి బ్రాహ్మణవర్గాలు గుడి తలుపులు మూశాయి.కుల వ్యవస్థను,అస్పశ్యతను బోధించిన హిందుత్వ ఆదర్శాల మూల గ్రంథంమనుస్మతిని ఖండించారు. 25.12.1927నదాన్ని కాల్చేశారు. ఆంబేడ్కర్లు, దళితులు డిసెంబర్ 25న మనుస్మతి దహనదినం జరుపుకుంటారు.
1932లో బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం అణగారిన వర్గాలకు (ఇండియా చట్టం-1935లో, రాజ్యాంగంలో వీరిని షెడ్యూల్డ్ కులాలు, తరగతులుగా పేర్కొన్నారు.) ప్రత్యేక నియోజకవర్గాలు (కమ్యూనల్ అవార్డు) ప్రకటించింది. హిందు సమాజాన్నిచీలుస్తాయన్న భయంతో గాంధీ వీటినితీవ్రంగా వ్యతిరేకించారు. 25.09.1932న దళిత ప్రతినిధిగా ఆంబేడ్కర్ కు, దళితేతర హిందు ప్రతినిధిగా మదన్ మోహన్ మాలవీయాకు మధ్య పూనా ఒప్పందం పేరుతో అంగీకారం కుదిరింది. దీని ప్రకారం అణగారినవర్గాలకు చట్టసభల్లో స్థానాలు కేటాయించారు. అణగారిన వర్గాలకుకమ్యూనల్ అవార్డు ప్రకారం 71 స్థానాలకు బదులు పూనా ఒప్పందం మేరకు 148 స్థానాలు లభించాయి. 1935లోఆంబేడ్కర్ భార్య రమాబాయి దీర్ఘ అనారోగ్యంతోమరణించారు.15.04.1948లో తన ఆరోగ్య సంరక్షణ కోసం డాక్టర్ శారద కబీర్ ను పెళ్ళాడారు. ఆమె సవితా ఆంబేడ్కర్ గా పేరుమార్చుకున్నారు.1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించారు. 1937లోసెంట్రల్ ప్రావిన్స్ శాసనసభ ఎన్నికల్లో 13లో 11 రిజర్వ్డ్ సీట్లు, 4లో 3 జనరల్ సీట్లు గెలిచారు. 15.05.1936న కుల నిర్మూలన పుస్తకం ప్రచురించారు. గాంధీ ఆంగ్ల పత్రికల్లో కులవ్యవస్థను వ్యతిరేకించేవారు.గుజరాతీ పత్రికల్లో సమర్థించేవారు. బిబిసి ఇంటర్వ్యూలో ఆంబేడ్కర్గాంధీహిందుత్వ ద్వంద్వ వైఖరిని ఖండించారు. సావర్కర్ ద్విజాతి సిద్దాంతాన్ని, పాకిస్తాన్ ఏర్పాటును జిన్నా బలపర్చారు. ఆంబేడ్కర్ పాకిస్తాన్ ఏర్పాటును సమర్థిస్తూ పాకిస్తాన్ ఆలోచనలు అన్న 400 పేజీల పుస్తకం రాశారు.ఆంబేడ్కర్ 1946లో భారత రాజ్యాంగ నిర్మాణసభకు ఎన్నికకాలేదు. ముస్లిం లీగ్ అధికారంలో ఉన్న బెంగాల్ నుండి ఎన్నికయారు. 1952 లోక్ సభ ఎన్నికల్లో, 1954 ఉప ఎన్నికల్లోనూలోక్ సభకు ఎన్నికకాలేదు. ఆంబేడ్కర్ కశ్మీర్ ప్రత్యేక హౌదాను వ్యతిరేకించారు. సంఘ సంస్కరణలకు సహకరిస్తుందన్న అభిప్రాయంతోఏకీకత పౌరస్మతి (యూనిఫాం సివిల్ కోడ్) ఆమోదానికి సిఫారసుచేశారు.వారసత్వ, వివాహ చట్టాల్లోలింగసమానతను కల్పించే హిందు కోడ్ బిల్లును ఆంబేడ్కర్ప్రవేశపెట్టారు. దీన్నిపార్లమెంటు తిరస్కరించింది. నిరసనగా ఆయన 1951లో న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేశారు.
సామాజిక-రాజకీయ సంస్కర్తగా ఆంబేడ్కర్ ప్రభావం ఆధునిక భారతంపై గాఢంగా ఉంది.ఆంబేడ్కర్ నా ఆర్థికశాస్త్రాల పితామహుడని నోబెల్ బహుమతి గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్ కొనియాడారు. ఆంబేడ్కర్ తాత్వికతతో అనేక రాజకీయ పక్షాలు పుట్టాయి. సాహిత్యం వెలువడింది. కార్మికసంఘాలు నిర్మించబడ్డాయి. బుద్ధిజం-కమ్యూనిజం వ్యాసంలో ఆంబేడ్కర్ కమ్యూనిజంపై తన అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఆధిపత్యవర్గాల దోపిడీపేదరికానికి, సామాన్యప్రజల సమస్యలకు కారణమని విశ్లేషించారు. ఆర్థిక దోపిడీ కంటే సాంస్కతిక దోపిడీ అపాయకరమన్నారు. హింసతోనైనా కార్మికవర్గ విప్లవం సాధించాలన్న కమ్యూనిస్టు దక్పథాన్ని, ఉత్పత్తిసాధనాలు రాజ్య నియంత్రణలో ఉండాలి, వ్యక్తిగత ఆస్తి ఉండరాదన్న మార్క్సిస్టు సిద్దాంతాన్నీ తప్పుబట్టారు. రాజ్యరహిత ప్రజాతంత్రాన్ని అంగీకరించలేదు కాని వర్గరహిత సమాజాన్ని ఆమోదించారు. సిక్కు మతంలో చేరాలన్న అభిప్రాయం మార్చుకొని భార్యతో సహా 14.10.1956న బుద్ధిజంలో చేరారు. 5 లక్షల ఆంబేడ్కర్ మద్దతుదారులు బుద్ధిస్టులుగా మారారు. 1954 జూన్-అక్టోబర్లలో ఆరోగ్యం క్షీణించి ఆంబేడ్కర్ పక్కపైనే ఉన్నారు. 06.12.1956న తుది శ్వాస వదిలారు. భారత ప్రభుత్వంఆంబేడ్కర్ ను మరణానంతర భారతరత్న పురస్కారంతో సన్మానించింది. నేడు లాల్ నీల్ ఐక్యత ఆంబేడ్కర్ కు సరైన నివాళి కాగలదు.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
సెల్ : 9490 20 4545