Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వ్యక్తిత్వానికి సమకాలీన దేశ రాజకీయాల్లో చాలా ప్రాధాన్యత వచ్చింది. ఇప్పుడు అందరూ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు. రకరకాల దక్పథాల నుంచి రకరకాలుగా అంచనాలు వేస్తున్నారు. ఆయన మౌళిక ఆలోచనలను తమ అవసరాలకు అనుగుణంగా కుదించి, వక్రీకరించి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అంబేద్కర్ జీవితానికి, ఆలోచనలకు ఈ సమయంలో ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది? అంబేద్కర్ జీవిత కషి ఎక్కువ భాగం స్వాతంత్య్రానికి పూర్వం జరిగింది. ఆయన 1956లోనే చనిపోయారు. ఆయన జీవించిన కాలంలో అనేక మంది ఆయన భావాలను పూర్తిగా తిరస్కరించారు. ఆయన కషిని వ్యతిరేకించారు. కానీ అప్పుడు ఆయనను తిరస్కరించిన సంస్థలకు, భావాలకు వారసులుగా ఉన్నవారు ఇప్పుడు ఆయనను ఆకాశానికి ఎత్తి బ్రహ్మరథం పడుతున్నారు. నేడు దేశంలో అంబేద్కర్ భావాలకు, వ్యక్తిత్వానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చి చర్చించటానికి ఒక రాజకీయ చారిత్రక నేపథ్యం ఉన్నది. అంబేద్కర్ ఆలోచనలపై దాడి చేయడం వల్ల అనుకున్న ఫలితాలను పూర్తిగా సాధించడం సాధ్యం కానందునే ఆర్ఎస్ఎస్, సంఫ్ు పరివార్ శక్తులు అంబేద్కర్ ఆలోచనలను వక్రీకరించి, తమకు తగినట్లుగా తీర్చిదిద్ది, ఆయనను తమ వాడిగా చేసుకొనే ప్రయత్నాలను గత కొంతకాలంగా చేస్తున్నారు. అంబేద్కర్ హిందూ మతాన్ని సంస్కరించి,మెరుగు పర్చడానికి కషిచేసిన సంఘసంస్కర్త అని, ఇస్లాం, క్రైస్తవ మతాలను తిరస్కరించిన ఆయన ఉత్తమ జాతీయవాదని అందుకే భారతీయ సంస్కతిలో భాగమైన బౌద్ధమతాన్ని స్వీకరించారని ప్రచారం చేస్తున్నారు. సంఫ్ు పరివార్ సిద్ధాంత కర్తలయిన నాయకుల సరసన అంబేద్కర్ కి స్థానం ఇచ్చి, భ్రమలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సంఫ్ు పరివార్ శక్తులు, బిజెపి చేసే ప్రయత్నాలు నిజాయితీ, చిత్తశుద్ధి లేనివి. జీవితాంతం అంబేద్కర్ చెప్పిన భావాలు హిందుత్వ శక్తుల భావాలకు పూర్తి వ్యతిరేకం. కులవ్యవస్థను నాశనం చేయడానికి, ఆ వ్యవస్థకు ఆలంబనగా ఉన్న హిందూ మత భావాలను,హిందూ మత బోధలను తుత్తునియలు చేయడానికి అయన జీవితమంతా కషి చేశారు. హిందూ మతం ఉన్నంత కాలం కులం, అంటరానితనం పోవని, దాన్ని వదిలేస్తేనే దళితులకు విముక్తి లభిస్తుందని అంబేద్కర్ బలంగా నమ్మారు.అందుకే చాలా తీవ్రమైన మీమాంస తరువాత తన అనుయాయులతో హిందూ మతాన్ని వీడి బౌద్ధమతాన్ని స్వీకరించారు. 1930 దశకంలోనే తను హిందువుగా మరణించనని ప్రకటించారు. ఆయన జీవిత చరమాంకం వరకు మతమార్పిడి గురించి చర్య తీసుకోకపోయినా, ఆయన అభిప్రాయంలో మార్పు రాలేదు. అనేక మంది అనేక కారణాల వలన ఇస్లాం మతంలోకి ఆకర్షించాలని అంబేద్కర్ తో చర్చలు జరిపారు. ఆయనను క్రైస్తవ మతంలోకి ఆకర్షించాలని అనేక మంది ప్రయత్నించారు. సిక్కు మతం అయితే ఎలా ఉంటుందని అంబేద్కర్ స్వయంగా ఒక అలోచన చేసి అనేక మందితో చర్చించారు. అంబేద్కర్ మతమార్పిడి గురించి ఆలోచిస్తున్నారని తెలిసి ఆ ప్రయత్నాలను అడ్డుకోవడానికి కూడా అనేక మంది ప్రయత్నించారు. అంతగా హిందూ మతంలో ఉండటం ఇష్టం లేకపోతే పరమతాలయిన ఇస్లాం, క్రైస్తవ మతాలను కాకుండా, జాతీయ స్రవంతిలో భాగమైన ఇంకా ఎదైనా మతం గురించి ఆలోచించమని హిందూ మహాసభ నాయకులు అంబేద్కర్ని వేడుకున్నారు. కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న జగ్జీవన్రామ్ వంటివారు, దళిత నాయకులుగా ఉన్న ఎసి రాజా వంటివారు హిందూ మతాన్ని వీడిపోవాలన్న అంబేద్కర్ ఆలోచనలను తీవ్రంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ అంబేద్కర్ హిందూ మత వ్యవస్థలో సామాజిక న్యాయం సాధ్యం కాదన్న స్పష్టమైన భావంతో ఉన్నందునే మత మార్పిడికి సిద్ధం అయ్యారు. అందువల్ల అంబేద్కర్ ను హిందూ మత సంస్కర్తగా చిత్రీకరించడానికి సంఘపరివార్ శక్తులు చేసే ప్రయత్నాలు కుటిల బుద్ధితో కూడుకున్నవి. అంబేద్కర్ వ్యక్తిత్వాన్ని ప్రధాన స్రవంతి బూర్జువా నాయకుని స్థాయికి పరిమితం జేయాలని కాంగ్రెస్ మొదటి నుండీ ప్రయత్నించింది. రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికల్లో మొదట అంబేద్కర్ ను కాంగ్రెస్ వారు ఓడించారు. ఆయన బెంగాల్ నుండి ముస్లింలీగ్ సహాయంతో రాజ్యాంగ సభ సభ్యునిగా గెలిచారు. దేశం విడిపోయినప్పుడు బెంగాల్ విడిపోయి, ఆయన సభ్యత్వం రద్దయింది. అపుడు కాంగ్రెస్ పార్టీ ముంబయి ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ సభ్యుని చేత రాజీనామా చేయించి, ఆ స్థానంలో అంబేద్కర్ని నిలబెట్టి గెలిపించి, రాజ్యాంగ సభకు తీసుకొచ్చి, రాజ్యాంగసభలో రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ గా చేశారు. అంబేద్కర్ లాంటి వాళ్లు తమ మధ్య ఉంటే బలహీన వర్గాల ప్రజల్ని ఆకట్టుకోవటానికి, నియంత్రణ చేయడానికి ఉపయోగమని భావించారు. అంబేద్కర్ ను పెట్టి తూలనాడిన వాళ్లే తమలో చేర్చుకున్నారు. అంబేద్కర్ను కాంగ్రెస్ ఆలింగనం చేసుకోవడంతో దళితులు కూడా కాంగ్రెస్ వైపుకు మొగ్గారు. ఆ తర్వాత అంబేద్కర్ కాంగ్రెస్ నుండి దూరమయినా, దళితులు దూరం గాకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడ్డది. ఇందిరాగాంధీ కాలం వరకు దళితులు కాంగ్రెసులో చేరుతూనే ఉన్నారు. కాంగ్రెస్ కు దూరమయినా అంబేద్కర్ విగ్రహాలను కాంగ్రెస్ విడిచి పెట్టలేదు. సరళీకరణ విధానాలను తలకెత్తుకున్న తర్వాత కాంగ్రెస్ పాలనలో దళితులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. దాంతో దళితులు అనేక రాష్ట్రాలలో దూరమవ్వడం ప్రారంభమయ్యింది. అంబేద్కర్ను మళ్లీ తమ వాడిగా చిత్రీకరించుకుని, అంబేద్కర్ భావాలే తమ భావాలని చెప్పుకోవడమే కాకుండా, దళితులు, ఇతర సామాజిక తరగతులను తమ వైపు ఆకర్షించుకునేలా కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. 1991లో సరళీకరణ విధానాలు ప్రారంభమైన తర్వాత అంబేద్కర్ వారసత్వాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం ప్రారంభమైంది. రిజర్వేషన్లు, సాంఘిక సంక్షేమ పథకాలను బలహీనం చేయటం, భూసంస్కరణల రద్దు తదితర చర్యల వలన దళితులు నష్టపోయారు. దళితుల ప్రయోజనం కోసం వాటిని రక్షించుకోవలసిన అవసరం ఏర్పడింది. ఈ మధ్యకాలంలో దళితుల్లో మధ్య తరగతి అభివద్ధి అయింది. మిగతా కులాల్లో కూడా రిజర్వేషన్లు, ఇతర అంశాల వలన చదువుకున్న ఒక చిన్న మధ్యతరగతి, ఇంకా పైకి ఎగబాకాలి అని ఆశ కలిగిన ఒక చిన్న పొర ఏర్పడింది. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లను రక్షించుకోవడం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు విస్తరించడం జరగకపోతే తమకు భవిష్యత్ ఉండదన్న భావం ఈ తరగతుల్లో ఏర్పడింది. కానీ నేడు రిజర్వేషన్లను ఎత్తివేసే కుటిల యత్నాలు సజావుగా సాగుతున్నాయి. సరళీకరణ విధానాల పట్ల తీవ్రమవుతున్న బలహీనవర్గాల అసంతప్తి కూడా అంబేద్కర్ పట్ల ఆసక్తి పెరగడానికి మరొక కారణం. అంబేద్కర్ ను మన దేశ పాలకవర్గాలు తమకు సంబంధించిన ఒక సింబల్ గా వినియోగించుకొంటున్నాయి. సింబల్ గా వినియోగించుకొనే వాటిలో ఆయన విగ్రహం ముఖ్యమైనది. అంబేద్కర్ చేసింది ఇతరంగా ఏమీ లేనట్లు, రాజ్యాంగ రచనలో మాత్రమే ఆయన పాత్ర ఉన్నట్లు ఆయన విగ్రహం చేతిలో రాజ్యంగం పుస్తకం పెడతారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ పాత్ర విస్మరించరానిదనే దాంట్లో సందేహం లేదు. రాజ్యాంగ నిర్మాత అని ఆయనను కొనియాడడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బలహీన వర్గాల ప్రయోజనాల రక్షణ కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్లను జొప్పించడంలో అంబేద్కర్ కషి ఎనలేనిది. ఒక లిబరల్ ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని తయారు చేయడంలో అంబేద్కర్ ముద్ర స్పష్టంగా కన్పిస్తుంది. అయినా మన రాజ్యాంగం యొక్క మౌళిక స్వభావం వ్యక్తిగత ఆస్తి రక్షణే అన్నది మరువకూడదు. సామాన్యులకు పనికొచ్చే అంశాలన్నింటిని హక్కులుగా కాకుండా ఆదేశిక సూత్రాలకు పరిమితం చేశారు. రాజ్యాంగం తయారీలో అంబేద్కర్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే ఎటువంటి రాజ్యాంగం తయారయ్యేదో రాజ్యాంగ సభకు ఆయన సమర్పించిన మెమోరాండాన్ని చదివితే ఎవరైనా గమనించగలరు. అంబేద్కర్ అభిప్రాయాలు రాజ్యాంగంలో పొందుపర్చిన వాటికన్నా తీవ్రమైనవి,ప్రత్యామ్నాయమైనవి. వాస్తవంగా అంబేద్కర్ లో మౌళిక భావాలతో కూడిన అంశాలు చాలా ఉన్నాయి. కులవ్యవస్థ గురించి, ప్రజాస్వామ్యం గురించి, సమానత్వం గురించి గ్రామీణ, సామాజిక వ్యవస్థ గురించి అనేక అభ్యుదయ అంశాలు ఉన్నాయి. కొత్త వ్యవస్థలో సార్వజనీన ఓటు ఉండాలి. సమానత్వం, స్వేచ్ఛ ఉండాలి. వ్యక్తిగత ఆస్తిహక్కుకు రక్షణ ఉండాలన్న విషయాలను వివరించారు. ఎటువంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలో కూడా చెప్పారు. మిశ్రమ ఆర్థికవ్యవస్థను ప్రతిబింబిస్తూ పెట్టుబడిదారులందరూ కలిసి రూపొందించిన బాంబేప్లాన్ కన్నా మరికొంత రాడికల్ గా ఉండే వాటిని దీనిలో ప్రతిపాదిస్తారు. కీలకమైన పరిశ్రమలు జాతీయం చేయాలి. బీమారంగం వంటి వాటిని జాతీయం చేయాలి కానీ నేటి బిజెపి ప్రభుత్వం సర్వం ప్రైవేట్ మయం చేసింది. భూమిని జాతీయం చేసి, రైతులకు కౌలుకిచ్చి ప్రభుత్వమే వారికి పెట్టుబడులు అందజేసి ప్రోత్సహించాలని కూడా అంబేద్కర్ చెప్పారు. భారతదేశంలో అత్యంత దుర్మార్గమైనది కులవ్యవస్థ.కులవ్యవస్థను నాశనం చేయాలనేది అంబేద్కర్ లక్ష్యం. అందుకే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేయాలని చెప్పారు. కులవ్యవస్థకు పునాది గ్రామం. గ్రామాల్లో ఉంటే అంటరానితనం నుండి విముక్తి ఉండదు. కాబట్టి దళితులకు ప్రత్యేక గ్రామాల్ని నిర్మించాలని భావించారు. ప్రత్యేకంగా దళితులకు భూములు కేటాయించండి అని కోరారు. ప్రస్తుత గ్రామాలలో గ్రామ స్వరాజ్యం అన్న గాంధీజీ నినాదం గ్రామాల్లో అగ్ర కులాలకు, ఆధిపత్య కులాలకు పెత్తనం ఇవ్వడమేనన్నది అంబేద్కర్ అభిప్రాయం. ఈ అభిప్రాయం అక్షరాలా నిజమేనని అనుభవం చెబుతున్నది. వాస్తవంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పాలకవర్గాలకు గ్రామాల్లో మంచి పునాది ఏర్పడింది. పాలకవర్గాలను బలపరిచే శక్తులు గ్రామాలలో బలపడ్డాయి. అంబేద్కర్ తన జీవిత కాలంలో రాజ్యాంగ నిర్మాణంలో వెచ్చించింది రెండు మూడు సంవత్సరాలు మాత్రమే. మిగిలిన జీవితమంతా కులవ్యవస్థ నిర్మూలన కోసం, బలహీన వర్గాల విముక్తి కోసం పాటుపడ్డారు. అంబేద్కర్ వ్యక్తిత్వంలోని ఈ మౌళిక పార్శ్వాన్ని మరుగు పర్చి, రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే ఆయనను చిత్రీకరించడం వాస్తవంగా కులవ్యవస్థ నిర్మూలన గురించి ఆయన చెప్పిన అంశాలను వెనక్కు నెట్టి అంబేద్కర్ వారసత్వానికి అన్యాయం చేయడమే అవుతుంది. అంబేద్కర్ లో సామాజిక మార్పుకు తోడ్పడే పార్శ్వాన్ని పెద్దది చేసి, కాపాడుకుని, సామాజిక మార్పు కోసం పోరాడే శక్తులకు ఉపయోగపడే వ్యక్తిగా అంబేద్కర్ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవంగా అంబేద్కర్ వ్యక్తిత్వంలో, సిద్ధాంతంలో సామాజిక మార్పుకు దోహదం చేసే వాటిని రక్షించుకుంటూ ముందుకు పోవాలి. ఫ్యూడలిజానికి వ్యతిరేకమైన, సామాజిక మార్పుకు దోహదం చేసే భావజాలాన్ని రక్షించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అంబేద్కర్ భారతదేశంలో ప్యూడల్ వ్యవస్థను భగం చేయడానికి, దానిలో తీవ్రమైన మార్పుకు దోహదం చేసే కషి చేశారు. ఇటువంటి పరిస్థితిలో పాతకాలంలో అభ్యుదయ వాదులు అందించిన దానికన్నా ఒక పదునైన ఆయుధాన్ని అంబేద్కర్ నుంచి మనం పొందవచ్చు. దాన్ని తీసుకుని సామాజిక మార్పు కోసం దేశంలో ఉన్న లౌకిక,ప్రజాతంత్ర శక్తులు ముందుకు సాగాలి.
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్ : 9676407140