Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు సిబ్బంది వివరాల సేకరణలో విద్యాశాఖ
- జిల్లాలో టీచర్లు 24,892, సిబ్బంది 2127గా గుర్తింపు
- 16 వేలకుపైగా ఆన్లైన్లో దరఖాస్తులు నమోదు
- మరో రెండు రోజులు మాత్రమే గడువు..!
- 21 తర్వాత సిబ్బంది ఖాతాల్లో నగదు జమ
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా మహమ్మారితో ఉపాధి కోల్పో యి అవస్థలు పడుతున్న ప్రయివేటు ఉపాధ్యాయులు, సిబ్బంది ఒక్కొక్కరికి నెలకు రూ.2వేలు, 25కిలోల సన్నబి య్యం సరఫరా వంటి ఆపత్కాల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిం చిన సంగతి తెలిసిందే. సర్కారు నిర్ణయం నేపథ్యంలో జిల్లాలోని విద్యాశాఖ అధికా రులు జిల్లాలోని ప్రయివేటు టీచర్ల లెక్క తేల్చే పనిలో నిమగమయ్యారు. ఇందుకోసం ఇప్పటికే జిల్లా ఉపవిద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో మండల కమిటీలను సైతం నియమించారు. గడిచిన నాలుగు రోజులుగా అర్హులైన వారి వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 16వేలకుపైగా టీచర్లు, సిబ్బంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్టు సమాచారం. మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో సుమారు 11వేలకుపైగా సిబ్బంది వివరాలు నమోదు చేయాలి. దానికితోడు ఇప్పటికీ యూడైస్లో నమోదు కానీ సిబ్బంది వివరాలు కలిపితే ఈసంఖ్య రెట్టింపు అయ్యే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.హైదరాబాద్ పరిధిలో జిల్లా విద్యాశాఖ అధికారుల గణాంకాల ప్రకారం గుర్తింపు పొందిన ప్రయివేటు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1890 ఉన్నాయి. ఇందులో 24,892 మంది ఉపాధ్యాయులు, 2127 బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో బడులు మూసివేయడంతో అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఉపాధి కోల్పోయారు. మార్చిలో ప్రకటించిన లాక్డౌన్ నుంచి నేటికీ చాలామంది ప్రయివేటు టీచర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడు తున్నారు. ఇప్పుడు వీరికి ఆపత్కాల ఆర్థిక సాయం కింద సర్కారు రూ.2వేలు, 25కిలోల బియ్యం రేషన్ షాపుల ద్వారా ఉచితంగా అందించనుంది. 2020 మార్చి 16వ తేదీ వరకు ఆయా విద్యా సంస్థల్లో పనిచేసిన ఉపాధ్యాయులు, నాన్టీచింగ్ స్టాఫ్ వివరాలను ఈ నెల 15వ తేదీలోపు ప్రధానోపాధ్యాయులు వెబ్సైట్లో నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో వారు ఈ పనిలో నిమగమయ్యారు. ఈ నెల 16 నుంచి 19వరకూ మండల, జిల్లా స్థాయిలో స్క్రూటిని ఉం టుంది. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపట్టికతో పాటు ఆధార్, బ్యాంకు ఖాతా, ఇతర వ్యక్తిగత వివరాలను యాజమాన్యాలు యూడైస్లో పొందుపర్చాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే అర్హులకు డబ్బులు జమ కానున్నాయి.
కమిటీల పర్యవేక్షణ ఇలా..
ప్రయివేటు యాజమాన్యాలు వైబ్సైట్లో పొందుపర్చిన ఉపాధ్యా యులు, సిబ్బంది వివరాలు ఎంత వరకు వాస్తవాలో తెలుసుకు నేందుకు జిల్లా ఉపవిద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో కాంప్లెక్స్ హెచ్ఎంలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సీఆర్పీలతో మండల కమిటీలను డీఈవో ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. దా దాపు 74 కమిటీలను నియమించారు. ఒక్కొ బృందం 15-20 స్కూ ళ్లను పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది. దీనికితోడు యూడైస్లో నమోదు కాకుండా ఇంకా ఎవరైనా సిబ్బంది పాఠశాలల్లో పనిచేస్తున్నట్టయితే ప్రభుత్వం, కలెక్టర్ ఆదేశాల మేరకు వారి వివరాలను పరిశీలించి ఆమోదించనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు.