Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
- 'ఆద్య స్కంద డయాగస్టిక్ సెంటర్' ప్రారంభం
నవతెలంగాణ-దుండిగల్
ఆధునిక వైద్య సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ 'ఆద్య స్కంద డయాగస్టిక్ సెంటర్' నగర ప్రజలకు చేరువ కావాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం కూకట్పల్లిలోని కేఎన్ఆర్ కాంప్లెక్స్లో 'ఆద్య స్కంద డయాగస్టిక్ సెంటర్ను' నిజాంపేట్ మేయర్ నీలా గోపాల్రెడ్డి, సన్షైన్ ఆస్పత్రుల చైర్మెన్ డాక్టర్ గురువారెడ్డి, ప్రముఖ సినీ డైరెక్టర్ మారుతి, నిర్వాహకులు వెంకట సుధాకర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నగరంలో ముఖ్యంగా కూకట్పల్లి, కుత్భుల్లాపూర్, నిజాంపేట్, శేరిలింగంపల్లి ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆధునిక వసతులతో డయాగస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. కరోనాతో పాటు ఇతర వ్యాధినిర్ధారణ పరీక్షలు అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ఖర్చుతో అందించాలన్నారు. కొన్నేండ్లుగా హైదరాబాద్ సిటీలో డాక్టర్ వెంకట సుధాకర్రెడ్డి, డాక్టర్ రూపారెడ్డిలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. అనంతరం డాక్టర్ గురువారెడ్డి, డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. స్కంద డయాగస్టిక్ సెంటర్ ప్రజల మన్ననలు పొందుతూ.. నగరవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు. డాక్టర్ వెంకటసుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. 'కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, శేరిలింగంపల్లి సమీప ప్రాంతాల ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్ధేశంతోనే ఈ డయాగస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. కొవిడ్ నేపథ్యంలో టెస్టులు క్షణాల్లో పూర్తిచేసేలా ల్యాబ్లో అన్ని ఆటోమేటెడ్ మెషిన్స్ ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా మల్టీ స్లర్సు సీటీ స్కాన్, ఎక్స్రే ఇన్ 3 సెకన్స్- డిజిటల్ రేడియోగ్రఫీ, 4డీ-అల్ట్రాసౌండ్, కలర్ డాప్లర్, పాలీ క్లినిక్ ఇతర అన్ని ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన మెషిన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ల్యాబ్లకు సంబంధించిన అన్ని రకాల టెస్టులను పెద్దలు, పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా తక్కువ ప్యాకేజీలు రూపొందించి డిజైన్ చేశామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు నార్నే శ్రీనివాసరావు, విజయలక్ష్మి, సుబ్బారావు, రజిత రవికాంత్, టీఆర్ఎస్ నాయకులు కొలన్ సునీల్ రెడ్డి, స్థానిక నాయకులు, డయాగస్టిక్ సెంటర్ డాక్టర్లు, వైద్యసహాయక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.