Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు, వ్యాపారులకు నో టెన్షన్
- నేరుగా రవాణా చేసుకునే అవకాశం
- పండ్ల రవాణాకు 50 శాతం రాయితీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
మామిడి రైతులు, వ్యాపారులకు ఇక నో టెన్షన్. సరుకులను నేరుగా రవాణా చేసుకునే అవకాశం ఏర్పడింది. జగిత్యాల జిల్లా లింగంపేట్ నుంచి మంగ ళవారం న్యూఢిల్లీకి కిసాన్ రైల్ ప్రారంభమైంది. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండిస్టీస్ మంత్రిత్వ శాఖవారు సులువైన రవాణామార్గంపై దృష్టి సారించారు. ''ఆపరేషన్ గ్రీన్స్-టీఓపీ టోటల్'' పథకం కింద 50 శాతం రాయితీతో భారతీయ రైల్వే కిసాన్ రైల్ను ప్రవేశపెట్టారు. సికింద్రాబాద్ డివిజన్లో నూతనంగా ఏర్పాటైన బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్ (బీడీయూ) ద్వారా జగిత్యాలతోపాటు చుట్టుపక్కల వ్యాపా రస్తులకు, కార్గో నిర్వాహకులకు, బల్క్ రవాణాదారులతోపాటు రైతుల సౌకర్యార్థం ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
జగిత్యాల, లింగంపేట్ స్టేషన్ వద్ద సరుకు రవాణాకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేశారు. 50 శాతం రాయితీతో ఈ సౌకర్యాన్ని అందిస్తున్నారు. జగిత్యాలలోని లింగంపేట్ నుంచి న్యూఢిల్లీలోని ఆదర్శనగర్కు మంగళవారం 476 టన్నుల మామిడి పండ్ల లోడ్ పంపించారు.
ఈ సౌర్యాన్ని వినియోగించుకోవాలి: మాల్యా
లింగంపేట్ నుంచి న్యూఢిల్లీ కిసాన్ రైల్ రవాణాపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా సంతోషం వ్యక్తం చేశారు. కిసాన్ రైల్లో మామిడి పండ్ల రవాణాకు కృషి చేసిన సికింద్రాబాద్ డివిజన్ బృందాన్ని ఆయన అభినందించారు. కిసాన్ రైల్ రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. మామిడి పండ్ల సీజన్ పూర్తయ్యే వరకూ వాటిని లోడింగ్ చేస్తామని తెలిపారు.