Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భక్షాలు, ఉగాది పచ్చడి పంచుతూ నిరసన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయక చట్టాలను,విద్యుత్ సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. ఢిల్లీ రైతాంగ పోరాటానికి మద్దతుగా ఏఐకేఎస్సీసీ పిలుపులో భాగంగా హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం భక్షాలు, ఉగాది పచ్చడి, మామిడికాయలు పంచుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల దగ్గర రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞలు నిర్వహించాలని టి.సాగర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రసాద్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్బాబు, ఆవాజ్ రాష్ట్ర నాయకులు విప్తార్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్నాయక్, ఎస్ఎఫ్ఐ నగర నాయకులు అశ్విన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ ఆంజనేయులు, ఇతర నాయకులు వెంకన్న, జగదీష్, పాషా, మల్లన్న పాల్గొన్నారు.