Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అకాల వర్షాలు, ఎదురు గాలులు, వడగండ్ల వాన పడి పంటలు నష్టపోయాయని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదం డరెడ్డి చెప్పారు. పంట నష్టానికి సంబంధించిన జీవో నెంబర్ 1,2 వెం టనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీని ప్రకారం 35శాతం పంట నష్టపోయినా ప్రభుత్వం పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. బుధ వారం గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు.అకాల వర్షాలకు వరి, మామిడి, మొక్కజొన్న, కూరగాయాల పంటలు వేల ఎకరాల్లో దెబ్బ తిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సవరించిన జీవోలను అమలు చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా ఉధృతి దష్ట్యా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయవద్దని కాంగ్రెస్ అధికార ప్రతనిధి జి.నిరంజన్ కోరారు.ఈమేరకు ఎన్నికల ప్రధానాధికా రికి లేఖ రాశారు. సీఎం సభను అడ్డుకుంటారనే నెపంతో అరెస్టు చేసిన కాంగ్రెస్ నేతలు మనవతరారు, మహిపాల్యాదవ్లను విడుదల చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.