Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి 24వ అదనపు జడ్జి పిటిషన్పై హైకోర్టు వ్యాఖ్యలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
న్యాయ వ్యవస్థలో పని చేసే వారిపై అవినీతి ఆరోపణలొస్తే వాటిని చట్ట ప్రకారం విచారణ ఎదుర్కోవాలి తప్ప తమపై కేసు కొట్టేయాలని కోర్టును ఆశ్రయించడం తగదని హైకోర్టు అభిప్రాయపడింది. రంగారెడ్డి జిల్లా 24వ అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్న వరప్రసాద్కు ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై హైకోర్టు రిజిస్ట్రార్ విజిలెన్స్ విభాగం సస్పెండ్ చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దుర్గాప్రసాద్ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. దీనిని ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. ఇలాంటి వ్యాజ్యాన్ని ప్రోత్సహించబోమని తేల్చిచెప్పారు. పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.