Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బెల్లంపల్లి
కరోనాతో పోరాడుతున్న భర్త ఆరోగ్యంగా ఇంటికి తిరిగొస్తాడో లేదోనని మనోవేదనకు గురైన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో జరిగింది. మాజీ సింగరేణి కార్మికుడు సుద్దాల మొండయ్యతో పాటు అతని భార్య, కోడలు కరోనా బారిన పడ్డారు. వీరంతా ఈనెల 3న లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్లో శుభకార్యానికి వెళ్లొచ్చారు. ఇంటికొచ్చాక మొండయ్య దగ్గు, జలుబుతో ఇబ్బంది పడ్డాడు. వెంటనే పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్గా తేలింది. ఆ తర్వాత భార్య జలజ, చిన్న కోడలు కరోనా బారిన పడ్డారు. అత్తాకోడళ్లు హోంఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. మొండయ్య ఆరోగ్యం క్షీణించడంతో ఈ నెల 5న బెల్లంపల్లిలోని జిల్లా ఐసోలేషన్ ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు.