Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామ పంచాయతీలలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో పారదర్శకత, సమర్థత, జవాబుదారీ తనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలించింది. ప్రతి ఏటా కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఈ పంచాయత్ పురస్కారాలను అందచేస్తున్నది. 2019-20కి గానూ ఈ కేటగిరీలో తెలంగాణకు ఈ-అవార్డు లభించింది.
ఈ విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక సలహాదారు బిజయకుమార్ బెహరా బుధవారం ప్రకటించారు. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మూడో స్థానంలో రాజస్థాన్ నిలిచాయి. ఈ అవార్డు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ కృషి, దార్శనికత వల్లనే ఈ అవార్డు వచ్చిందని తెలిపారు. రాష్ట్రానికి వరుసగా అవార్డులు రావడానికి కృషిచేస్తున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, అధికారులను, గ్రామపంచాయతీ సిబ్బందిని మంత్రి అభినందించారు.