Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ తండ్రి, విశ్రాంత ఎంఈవో ఆజామ్ మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల కోవిడ్ ప్రబలింది. దీంతో హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇటీవల కోవిడ్ నుంచి కొలుకోవడంతో రెండ్రోజుల కిందట డిశ్చార్జి చేశారు. కాగా, బుధవారం మళ్లీ అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్కు తరలించగా.. పరిస్థితి విషమించి మృతిచెందారు. ఎమ్మెల్యే షకీల్ తండ్రి మృతిచెందడం పట్ల ఎమ్మెల్సీ కవిత సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యాధికారిగా ఎందరో జీవితాలను తీర్చిదిద్దిన ఆజామ్ సార్ మృతి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి రాజేశ్వర్ పేర్కొన్నారు.
సీఎం సంతాపం
బోధన ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ తండ్రి మహమ్మద్ ఆజం మరణంపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటనలో తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఆజం మరణంపట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.