Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని పలుచోట్ల గురువారం మోస్తరు వర్షం కురిసింది. సిద్ధిపేట జిల్లా ములుగులో అత్యధికంగా 4.74 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ రోజువారీ వాతావరణ రిపోర్టులో పేర్కొంది. అదే సమయంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అత్యధి కంగా 40.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డ యింది.
దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి దక్షిణ తమళ నాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడినది. దీని ఫలితంగా శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో పాటు వడగండ్ల వాన ఒకటెండ్రు ప్రదేశాల్లో పడే అవకాశముందని పేర్కొంది. గురువారం నాడు సిద్ధిపేట జిల్లా ములుగులో అత్యధికంగా 4.75 సెంటీమీటర్ల వర్షం కురవగా..ఆ తర్వాత దుడ్యాల్(వికారాబాద్ జిల్లా)లో 2.23, గౌరారం(సిద్ధిపేట)లో 2.5, గజ్వేల్(సిద్ధిపేట) 1.85, తొమ్మిదిరేకుల(రంగారెడ్డి జిల్లా)లో 1.73, బిజినేపల్లి (నాగర్కర్నూల్)లో 1.58 సెంటీమీటర్ల చొప్పున వాన పడింది. మరో ఏడెనిమిది ప్రాంతాల్లో కూడా ఒక సెంటీమీటర్కుపైగా వర్షపాతం నమో దైంది. ఓవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తున్న ప్పటికీ చాలా ప్రాంతాల్లో ఎండ కొడుతున్నది. దీనికి తోడు వాతావరణంలో వచ్చిన మార్పులతో ఉబ్బరం కూడా పెరిగింది.
గురువారంనాడు కొల్వాయి (జగిత్యాల)లో 40.3, బోరజ్(ఆదిలాబాద్) 40.1, ఎండపల్లి (జగిత్యాల) 40.0, సిరిపురం (ఖమ్మం)39.9, జానకాపూర్ (మంచిర్యాల) 39.9, కన్నేపల్లి (మంచిర్యాల)39.9, మధిర (ఖమ్మం) 39.9, భీముని(మంచిర్యాల)39.9 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.