Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీవీకే ఆధ్వర్యంలో కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ ప్రారంభం
నవతెలంగాణ-ఖమ్మం,వరంగల్
దేశంలో కరోనాఉధృతి కొనసాగు తున్న నేపథ్యంలో హాస్పటల్స్లో బెడ్స్, ఆక్సిజన్ దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖమ్మం నగ రంలో బోడేపూడి విజ్ఞాన కేంద్రం (బీవీకే) ఆధ్వర్యంలో కోవిడ్ ఐసొ లేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను ప్రముఖ వైద్యులు డా|| యలమంచిలి రవీంద్రనాథ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. కోవిడ్ వచ్చిన వారికి, మరణించిన వారికి సేవలు చేయడానికి కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాలేని పరిస్థితుల్లో మేమున్నామంటూ బీవీకే, ఎన్ఆర్ఐ ఫౌండేషన్, పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మహమ్మారిని జయించడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మానవత్వంతో ముందుకు వచ్చి కృషి చేయాలని బాధిత ప్రజలకు సహాయ, సహకారాలు అందించాలని కోరారు.
కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సెంటర్ నిర్వాహకులు పొన్నం వెంకటేశ్వరరావు, బండి రమేష్, ఎన్ఆర్ఐ, సువిధ, గురుదక్షిణ, పంచాక్షరయ్య ఫౌండేషన్స్ బాధ్యులు, ఎన్.ఆర్.ఐ. పేరెంట్స్ అసోసియేషన్ బాధ్యులు, సత్యసాయి సేవా సమితి నిర్వాహకులు, మంజీరా అపార్ట్మెంట్స్ బాధ్యులు, బండి వెంకటేశ్వరరావు, గురు దక్షిణ ఫౌండేషన్ బాధ్యులు ప్రసాద్, బిల్డర్స్ అసోసియేషన్ బాధ్యులు కృష్ణమోహన్, లయన్స్ క్లబ్ కాపా మురళి, డాక్టర్లు భారవి, డా|| గోపికృష్ణ, కొల్లు శ్రీహర్ష, మురళి, సుబ్బారావు, బీవీకే బాధ్యులు శ్రీనివాసరావు, శివన్నారాయణ, సీపీఐ(ఎం) నాయకులు, యూఎస్ఏ నుంచి బండి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కోవిడ్ హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు అభినందనీయం
డిప్యూటీ డీఎంహెచ్ఓ పాష
ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేసే ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, సీఐటీయూ, ఐద్వా సంఘాలు కోవిడ్ హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని డిప్యూటీ డీఎంహెచ్ఓ పాష అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ రామ్నగర్లోని సుందరయ్య భవన్లో ప్రజల సౌకర్యార్థం కరోనాపై సందేహాలు, సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెల్ప్లైన్ సెంటర్ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి హెల్ప్లైన్ సెంటర్కు సహకారాన్ని అందిస్తామని తెలిపారు.
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల రమేష్ మాట్లాడుతూ... కోవిడ్ సేవల సమాచారానికి 8106551545, 9848945141, 8179412173, 7730076951లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంపల్లి వాసుదేవరెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జి. ప్రభాకర్రెడ్డి, నాయకులు ఎం.చుక్కయ్య, గొడుగు వెంకట్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు బాషబోయిన సంతోష్, డి తిరుపతి, జిల్లా నాయకులు నర్సింహ, అరుణ పాల్గొన్నారు.