Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉదయం సరుకుల కోసం కిక్కిరిసిన జనం
- నిర్మానుష్యంగా రోడ్లు ొ సరిహద్దుల్లో వాహనాల నిలిపివేత
- పట్టణాలకు కూరగాయలు తీసుకెళ్లే రైతుల ఇబ్బందులు
కరోనా విజృంభణతో రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ తొలిరోజైన బుధవారం కొంతమేర సఫలమైనట్టు కనిపించింది. వ్యాపార సముదయాలు మూతపడినా.. అవగాహన, నిర్లక్ష్యంతో కొందరు బయటకు వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల్లోపే జనం తమకు కావాల్సిన పనులు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినా.. ఆ తరువాత కూడా కొన్ని చోట్ల తమకేమీ పట్టనట్టు రోడ్లపై తిరిగారు. ప్రధాన రోడ్లపైకి ఎవరూ రాకపోయినా.. గల్లీలు, కాలనీల్లో మాత్రం జనం తిరిగారు. అయితే, పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించిన ప్రాంతాల్లో జనం బయటకు రాలేదు. వాణిజ్య కార్యకలాపాలు, దుకాణాలను 10 గంటలకు బంద్ చేశారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు యథావిధిగా సాగాయి. లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు పోలీసులు హెచ్చరికలు చేశారు. అయితే, గ్రామాల నుంచి పట్టణాలు సిటీకి నిత్యం కూరగాయలు తీసుకెళ్లే రైతులు రవాణా లేక ఇబ్బంది పడ్డారు. సమీపంలోనే తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చింది.
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
హైదరాబాద్లో పదిన్నర తర్వాత ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పలుచోట్ల బారికేడ్లు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు నిర్వహిం చారు. వాటిని పోలీస్ ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. రాచకొండ పరిధిలో 46 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. రాచకొండ సీపీ మహేశ్భగవత్ ఉప్పల్, మేడిపల్లి, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. పోలీ సు సిబ్బంది మొత్తం మూడు షిప్టుల వారీగా పనిచేయ నున్నట్టు ఆయన తెలిపారు. కోఠి ఆంధ్ర బ్యాంకు వద్ద సిటీ అడిషనల్ సీపీ శిఖాగోయెల్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్రెడ్డి పరిశీలించారు. ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి మలక్ పేట ఏసీపీ వెంకటరమణ, ఇన్స్పెక్టర్ సుబ్బారావు, సిబ్బందితో కలసి దిల్సుఖ్నగర్ రాజీవ్చౌక్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఓల్డ్ సిటీలో లాక్డౌన్ పరిస్థితిని సీపీ అంజనీ కుమార్ పరిశీలించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపు ఇవ్వడంతో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యా పేట, కోదాడ, భువనగిరితో పాటు ప్రధాన పట్టణాల్లో జనం సరుకుల కొనుగోలుకు ఎగబడ్డారు. జనం ఎక్కువగా ఉండటంతో నల్లగొండలోని ప్రకాశంబ జార్, ఓల్డ్ సిటీలో ట్రాఫిక్జామ్ అయింది. 10 గంటల తర్వాత పోలీసులు దుకాణాలన్నీ మూసే యించారు. ఎన్హెచ్ -65తో పాటు నార్కట్పల్లి - అద్దంకి రహదారుల్లో వాహనాల రద్దీ కనిపించలేదు. నల్లగొండ, సూర్యాపేట ఎస్పీలు రంగనాథ్, భాస్కరన్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. నల్లగొండలో అదనపు ఎస్పీ నర్మద పలువురు వాహనదారులను ఆపి కౌన్సెలింగ్ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం వద్ద పోలీసులు వాహనాలను ఆపేశారు. అంబులెన్స్లు, అత్యవసరం ఉన్న వాటికే అనుమతి ఇచ్చారు. హైదరాబాద్తో పాటు, ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే వాహనాలను నిలిపేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనవస రంగా వాహనాలతో బయటకు వచ్చిన వారిని పోలీ సులు ఆపి హెచ్చరికలు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేష్చంద్ర, అదనపు పాలనాధికారి ఎం.డేవిడ్ లాక్డౌన్ను పర్య వేక్షించారు. నిర్మల్జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్ర కరణ్రెడ్డి లాక్డౌన్ను పర్యవేక్షించారు. ఇతర ప్రాం తాల నుంచి వచ్చేవాహనాలను ఎక్కడికక్కడే నిలువ రించారు. మంచిర్యాల జిల్లా సరిహద్దుల్లో పోలీసులు బందో బస్తు నిర్వహించారు. ఇతర ప్రాం తాలనుంచి ఎవరినీ రానీయకుండాచర్యలు చేపట్టారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వ్యాపార సము దాయాలకు తాళాలుపడ్డాయి. సడలింపు సమయం లో ఉదయం 6 గంటలకే జనాలు రోడ్లెక్కారు. బందోబస్తు ఏర్పాట్లను సీపీ కార్తికేయ పరిశీలించారు. కలెక్టర్ నారాయణరెడ్డి పీహెచ్సీలను తనిఖీ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి వేముల కోవిడ్పై సమీక్షించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రోడ్లపైకి వచ్చిన వారిని పోలీసులు ఆపి వివరాలు తెలుసు కొని, లాక్డౌన్ పాటించాలని కౌన్సెలింగ్ ఇచ్చి పం పించారు. పోలీస్ కమీషనర్ జోయల్ డేవిస్ ఉద యం సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో తిరుగుతూ ప్రజలకు, పోలీసులకు సూచనలు ఇచ్చా రు. తెరిచి ఉన్న రెండు షాపుల యజమానులతో మాట్లాడి బంద్ చేయించారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి ఓఆర్ఆర్ జాతీయ రహదారిపై బందో బస్తును పరిశీలించారు.
రంగారెడ్డి జిల్లాలో లాక్డౌన్ వల్ల ఉదయం 11 గంటల వరకు ఆర్టీసీ సర్వీసులు నడిచాయి. ఉదయం 5 గంటల నుంచి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు 1, 2 సర్వీసులు తిప్పి ఆ తరువాత బస్సులను రద్దు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో బస్సు సర్వీసులు నడిపించేందుకు ప్రతి డిపోలో డ్రైవర్, కండక్టర్లకు డ్యూటీలు వేశారు. అయితే, జిల్లా నుంచి హైదరాబాద్కు నిత్యం కూరగాయలను తీసుకెళ్లే రైతులు ఇబ్బందులు పడ్డారు. రవాణా లేక సమీపంలోని నియోజకవర్గ కేంద్రాల్లోనే విక్రయించుకునేందుకు పోటీ పడ్డారు. నారాయణ పేట జిల్లాలో కేంద్రంలో బస్సులు లేకపోవడంతో కొందరు బస్టాండ్లో ఉండిపోయారు. నాగర్కర్నూల్ పట్టణంలో ఉదయం నాలుగ్గంట లపాటు వ్యాపారలావాదేవీలతో రోడ్లన్నీ కిటకిట లాడాయి.
ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. పోలీసులు ప్రధాన కూడళ్లలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. 11 గంటల తరువాత రోడ్లు నిర్మానూష్యంగా మారాయి. పది గంటల తరువాత రోడ్లపైకి వచ్చిన వాహనాదారులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కరోనా టీకా, కరోనా పరీక్షల కోసం వచ్చిన వారు నడుచుకుంటూ ఇంటిబాటపట్టారు. వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అశ్వారావుపేటలో లాక్డౌన్ ఉల్లంగించిన ఓ దుకాణాదారునికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు.