Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బారికేడ్లు.. కంచెలు.. భారీగా పోలీసుల మోహరింపు
- మీడియాపాయింట్ ఎత్తివేత.. గన్పార్కే దిక్కు
- వాడివేడిగా జరగనున్న సమావేశాలు
- అధికార టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ రెడీ
- అంతా ఓకే అంటున్న ఎంఐఎం
- బీజేపీ సభ్యుల్లో అనైక్యత.. ఎడమొహం, పెడమొహం
- కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సమావేశాలు
- అసెంబ్లీ ఆవరణలో వ్యాక్సినేషన్, కోవిడ్ పరీక్షా కేంద్రాలు
- దళితబంధు సహా ఎనిమిది బిల్లులు సభ ముందుకు
- తొలిసారిగా మండలికి వాణీదేవి, శాసనసభకు నోముల భగత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 11గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లో ఇటీవల కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, కరోనా విపత్తులో మరణించిన వారికి సంతాపం ప్రకటించనున్నారు. అనంతరం ఉభయసభలు వాయిదా పడతాయి. ఆతర్వాత బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమా వేశమై సమావేశాల షెడ్యూల్, అజెండా ఖరారు చేయనున్నది. ఈ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. ధరణి సమస్యలు, భూ వివాదాలు, పోడు సమస్యలు, చిన్నారిపై లైంగికదాడి, రాజు ఆత్మహత్య, ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ, దళిత బంధు, పంటల నష్టపరిహారం, విభజన సమస్యలు, డ్రగ్స్ వంటి అంశాలపై అధికారపక్షాన్ని నిలదీయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఆరుగురు సభ్యులతో ఉన్న కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు అధికార టీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. ప్రాజెక్టుల నిర్మాణం, రిజర్వాయర్ల నిర్మాణం, పుష్కలమైన నీటి వసతితో వరి దిగుబడి పెరిగింది. వలసలు ఆగిపోయాయనే అంశాలను ప్రస్తావించటం ద్వారా హస్తంపార్టీ నోరుమూయించాలని గులాబీదళం భావిస్తున్నది. నిరుద్యోగ సమస్యను అసెంబ్లీలో ప్రధాన అజెండా చేయాలనే కాంగ్రెస్ ఎత్తుగడను అధికార పార్టీ సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రతిపక్ష హోదా పొందిన హూజురాబాద్ ఎన్నికల నుంచే ఎన్నికల మాటలు వినిస్తున్నది. కాంగ్రెస్ అదే చేస్తున్నది. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదంటే మాదే అనే భావనలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. అధికారం గురించి అప్పుడే రాజకీయ పార్టీలు మాట్లాడుతుండ టంతో ఎన్నికల వాతావరణం వచ్చేసింది.
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి, అందులో ఎలాంటి చర్చ జరగాలని కోరుకుంటున్నారు ?
ప్రజల ముఖ్యమైన సమస్యలన్నీ అసెంబ్లీలో చర్చకు రావాల్సిందే. ఆమేరకు ప్రభుత్వం, సీఎం కేసీఆర్ బాధ్యతగా అసెంబ్లీని నడపాలి. 19 పార్టీలు పెద్దఎత్తున రైతు ఉద్యమం చేస్తున్నా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పట్టించుకోకపోవడం దారుణం. తమిళనాడు, పంజాబ్ ముఖ్యమంత్రులు రైతులకు మద్దతుగా పాల్గొంటున్నా కేసీఆర్, జగన్ లో ఉలుకు, పలుకు లేదు. దీంతో మన రాష్ట్రాలకు, ప్రజలకు నష్టం..జీఎస్టీ పేరుతో అధికారాలన్నీ కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుంది. పగలు పోట్లా డటం, రాత్రి కాళ్లు మొక్కడం జరుగుతున్నది. కృష్ణా జలాలకు సంబంధించి ఇద్దరూ దోబూచులాడుకుని చివరకు తమ అధికారాన్ని కేంద్రం చేతిలో పెట్టారు. వీటితోపాటు టీఆర్ఎస్ వాగ్ధానాలు అమలు జరగలేదు. శాసనసభలో చర్చ జరగాలి. రాష్ట్రం మొత్తానికి దళితబంధు అమలుచేయాలి. డబ్బంతా ఎన్నికల కోసం హుజురాబాద్లో పెట్టడం సరికాదు. అందరికీ ఇప్పుడే దళితబందును ఇవ్వాలి. మైనార్టీలు, గిరిజనులు, చేనేత, గీత కార్మికులు, గౌడ్లు, బీసీలు అందరికీ దళితబంధు తరహాలో పథకం తేవాలని డిమాండ్ చేస్తున్నారు. దళితబంధు విధానంపై అసెంబ్లీలో చర్చ జరగాలి. ఈమేరకు సభను ఉప యోగించుకోవాలి. కేంద్రం చేసే చట్టాలు ప్రజావ్యతి రేకమైనవి. వాటిపైనా సమగ్ర చర్చకు సభలో అవకాశమివ్వాలి. దీనికి సీఎం చొరవతీసుకోవాలి. డబుల్బెడ్రూమ్, ధరణి విధానాల్లో లోపాల మూలంగా ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. అసైన్డ్, పోడుభూములకు చెందిన 20 లక్షల ఎకరాలకు ధరణి పరిష్కారం చూపడం లేదు. వారసత్వ భూము లకూ అంతే. భూసమస్యలనూ చర్చకు తీసుకోవాలి. ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లకు సంబంధించిన చర్చా నడవాలి. కార్పొరేట్ల కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునేం దుకే ఈ ప్రయత్నమంతా. 2.50లక్షల టన్నుల ధాన్యం వస్తే. 60వేలటన్నులు మాత్రమే కొంటామని రాష్ట్రం చెబుతున్నది. దీనిపైనా సభలో కచ్చితమైన చర్చకు అవకాశముండాలి.అసంఘటిత రంగం సమ స్యలపై కార్మిక సంఘాలు పోరాడుతున్నాయి. కనీస వేతనాలను సవరించాలి. ఏడేండ్లు దాటుతు న్నా కొత్తజీవోలు ఇవ్వడంలేదు. వీటిపైనా మాట్లాడాలి.
పోడు భూముల పోరాటానికి, భారత్బంద్కు కారణమేంటి ?
భారత్బంద్ అఖిలభారత స్థాయిలో రైతు సంఘా లు చేస్తున్నది. అందులో భాగంగానే రాజకీయ పార్టీ లు మద్దతు ఇస్తున్నాయి. మోడీ ప్రభుత్వ విధానాలు, కొవిడ్ సహాయ కార్యక్రమాలు, రాక్షస చట్టాలు, పెగాసస్ స్పైవేర్ తదితర అంశాల్లో కేంద్రం ఘోరం గా విఫలమైంది. పెగాసస్పై సుప్రీంకోర్టుకు మోడీ ప్రభుత్వం అబద్దాలు చెప్పింది. పోడు భూముల సమస్య పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. హరితహారం పేరుతో గిరిజనులను అడవుల నుంచి వెళ్లగొట్టి కార్పొరేట్లకు పట్టంకట్టే పనిలో ఉంది. కోతులు, వర్షాల కోసం గిరిజనులను అడవి నుంచి పంపేస్తారా? నల్లమలలో యురేనియం సర్వేలు ఎం దుకు చేయాలి? చెట్లను కొట్టేసి తవ్వకాలు జరిపేందు కగా? ఇందులో కార్పొరేట్ శక్తుల కుట్ర దాగుంది. పోడు చట్టాలు తెస్తామన్నారు. ఇప్పుడు సబ్కమిటీ వేశారు. విచారణ జరపకుండానే పోలీసులు, అటవీ శాఖ అధికారులు గిరిజనులపై దౌర్జన్యం చేస్తున్నారు. నిర్భందాన్ని ప్రయోగిస్తు న్నారు. ఈ సమస్యపై ప్రజలు కదులుతున్నారు. పోరాటం మరింత తీవ్రం కానుంది. గిరిజనులది బతుకుదెరువు సమస్య. పోరాటంలో ప్రాణాలు వదిలేందుకు కూడా గిరిజ నులు సై అంటున్నారు. ఈ విషయంలో సంపూర్ణ విజయం సాధిస్తుందనే విశ్వసిస్తున్నాం.