Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ కార్మికులకు 1104 యూనియన్ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ ఈనెల 27న జరగనున్న భారత్బంద్ను జయప్రదం చేయాలని 1104 యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ పద్మారెడ్డి, జి సాయిబాబు విజ్ఞప్తి చేశారు. ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో భోజన విరామ సమయంలో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు లేఖలు ఇచ్చినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. 10 నెలలుగా దేశ రాజధాని శివారు ప్రాంతంలో రైతులు ఉద్యమిస్తున్నారనీ, అనేకమంది తమ తోటి రైతులు ప్రాణాలు కోల్పోతున్నా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో రైతులు అందోళలు కొనసాగిస్తున్నారని చెప్పారు. వారి డిమాండ్లు పరిష్కరించడంలో కేంద్రప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనల్లో విద్యుత్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.