Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బ్రోకరేజీ సంస్థ కార్వీకి సంబంధించిన రూ.700 కోట్ల విలువ చేసే షేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం ఫ్రీజ్ చేసింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రయివేటు లిమిటెడ్ రూ.3000 కోట్ల మోసం కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. తాజాగా ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పార్ధసారథి ఆస్తుల జప్తు, ఇద్దరు కుమారుల ఆస్తుల్ని అధికారులు జప్తు చేశారు. దీంతో పార్థసారథికి మరింత ఉచ్చు బిగుసుకుంది.