Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 92శాతం అసంఘటిత రంగంలోనే
- హజ్హౌస్ ముందు ధర్నాలో ఎండీ అబ్బాస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మైనారిటీ బంధు ప్రకటించాలని, తద్వారా పేద ముస్లింలను ఆదుకోవాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని హజ్హౌస్ కార్యాలయం ముందు శనివారం ఆవాజ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంతో బాధలు పడుతున్న మైనార్టీలను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే మైనారిటీ బంధు పథకాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రతి పేద మైనారిటీ కుటుంబానికి రూ.10లక్షల సాయం చేయాలన్నారు. రాష్ట్రంలో మైనారిటీల ఆర్థిక, సామాజిక పరిస్థితి దయనీయం గా ఉందని చెప్పారు. కోవిడ్-19తో లాక్డౌన్ ప్రభా వం వల్ల ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నా యని వివరించారు. 92శాతం మంది మైనారిటీలు అసంఘటిత రంగంలో అస్థిరమైన ఆదాయ వనరులపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. చిన్న చిన్న వృత్తులు, వ్యాపారాలు చేసుకునేవాళ్లు, ఆటో, టాక్సీల డ్రైవర్లు, మెకానిక్లు, స్ట్రీట్ వెండర్స్ అప్పుల ఊబిలో కూరుకు పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీల స్థితిగతులపై అధ్యయనం చేసిన సుధీర్ కమీషన్ నివేదిక సిఫార్సు ప్రకారం బడ్జెట్ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఒకవైపు భావోద్వేగ అంశాలను లేవనెత్తి మైనారిటీల అభివద్ధి,సంక్షేమం గురించి చర్చ జరగకుండా చూసేందుకు మతోన్మాద రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంవీరి సంక్షేమం పట్ల తీవ్ర నిర్లక్ష్యా న్ని ప్రదర్శిస్తున్నదని చెప్పారు. అనంతరం వక్ఫ్ బోర్డు చైర్మెన్ సలీం కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అడ్వకేట్ ఖాలేద్ అహమ్మద్, ఆవాజ్ రాష్ట్ర నాయకులు అజీజ్ అహ్మద్ ఖాన్, గయా సుద్దీన్, షేక్ లతీఫ్,అబ్దుల్ సత్తార్,మహమ్మద్ అలీ,సయ్యద్ ఇఫ్తేకార్,మీర్ ఖాజా అలీ,షేక్ ఇమాం పాషా,రహీం ఖాన్, ఖయ్యాం,సలీం, అజారుద్దీన్, బాబర్,యాకూబ్, అక్తర్ బీ, అఫ్సర్, మహబూబ్ అలీ, జహంగీర్,నజీరుద్దీన్, మహమ్మద్ పాషా, ఖయ్యూం, జబ్బార్, అక్బర్, బాబా తదితరులు పాల్గొన్నారు.