Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యారంగంలో విశిష్టమైన సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులకు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జాతీయస్థాయి అవార్డును లీడ్ ఇండియా-2020 అందిస్తున్నది. ఈ మేరకు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు కందాల పాపిరెడ్డి, లిప్స్ అధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల రాంచందర్, ఉపాధ్యక్షులు ఆరుకాల రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి కె అనిల్కుమార్, కోశాధికారి ఆర్ శ్రీనివాస్రెడ్డి, కె శ్రీకాంత్రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 15న అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేస్తామని పేర్కొన్నారు.