Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్ బోర్డు మరో అనాలోచిత నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) విమర్శించింది. విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు గాడిలో పడుతున్న సమయంలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ను ప్రకటించిందని టిప్స్ కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ విద్యార్థులు ప్రథమ సంవత్సరం పాఠాలను చదవాలా? లేదంటే సెకండియర్ తరగతులకు హాజరవుతున్నందున ఈ పాఠాలు చదవాలా? అని ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.