Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యక్ష పరిశీలనతో లిఖించిన నవల ఆవిష్కరణ సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ బ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా 2000 సంవత్సరంలో సాగిన విద్యుత్ ఉద్యమం, పోలీసుల కాల్పుల్లో అమరులైన వీరుల ప్రతిరూపం బ్లూస్కార్ఫ్ పుస్తకమని వక్తలు చెప్పారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ సభకు మోదుగుపూలు ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా..సినిమా దర్శకులు వేణు ఊడుగుల పాల్గొని విప్లవ కుమార్ రాసిన బ్లూస్కార్ఫ్ నవలను అవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిజిటైలైజేషన్ వచ్చిన తర్వాత కంటెంట్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు. విజువల్ ఫామ్కు ప్రాముఖ్యత పెరిగిందని తెలిపారు. సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ కిటికీలోంచి చూసి రాసిన నవల కాదని చెప్పారు. ప్రత్యక్ష పరిశీలన, అనుభవం నుంచి రాసిన గొప్ప నవల ఇదని కొనియాడారు. ఉద్యమాన్ని, లవ్స్టోరీని బ్యాక్డ్రాప్గా తీసుకుని రాసిన ఈ నవలలో పద్దతులు పాటించడం ఎంతో అనుభవంతో కూడిన వ్యవహారమన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రోఫెసర్ డాక్టర్ కాశీం మాట్లాడుతూ కలం చేతబట్టిన రచయిత అంటరానివారు, శూద్రులైతే అక్షరానికి పొగరు, ఆర్తి ఎక్కువగా ఉంటుందని వివరించారు. పురోగామి మార్పునÛకు ఇదొక ఆలంబనగా ఉంటుందని చెప్పారు. కోయి కోటేశ్వరరావు పుస్తకాన్ని సమీక్ష చేయగా..టీపీఎస్కే కన్వీనర్ జి.రాములు మాట్లాడారు. కార్యక్రమంలో చలకాని వెంకటయాదవ్, వేపూరి శిరీష, వేణపల్లి పాండురంగారావు, వరకుమార్, కట్టకవిత, ఎ.వణజ, స్టాలిన్,తదితరులు పాల్గొన్నారు.