Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాతృమూర్తి కల్పకం ఏచూరి మరణం పట్ల ఆ పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆమె మరణం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్, ఎంసీపీఐ(యూ) ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ సైతం కల్పకం ఏచూరి మరణం పట్ల సంతాపం తెలిపారు. ఏపీ, మహారాష్ట్ర సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీలు సంతాపాన్ని తెలిపాయి. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ఈమేరకు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, రాజస్థాన్ సీనియర్ ఎమ్మెల్యేలు ఎంవై తరిగమి, అమ్రారామ్, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి, టిఆర్ఎస్ ఎంపి రంజిత్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.