Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజమేనంటున్న టీఆర్ఎస్ వర్గాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పలు అధికారిక, రాజకీయ కారణాలతోపాటు దంత వైద్యం చేయించుకోవటం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారా..? అంటే అవుననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. గతంలో కంటికి సంబంధించిన శస్త్ర చికిత్సను కూడా ఆయన హస్తినలో చేయించుకున్న విషయం విదితమే. హైదరాబాద్లో ఎల్వీ ప్రసాద్, సరోజిని దేవీ కంటి ఆస్ప్రతులు చాలా ప్రముఖమైనవి. గతంలో పలువురు రాష్ట్రపతులు, ప్రధానులు సైతం ఆయా ఆస్పత్రులకు వచ్చి, చికిత్స పొందిన దాఖలాలు న్నాయి. ఇటీవల కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ కుమారుడు సైతం హైదరాబాద్కు వచ్చి ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటికి చికిత్స చేయించుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం వీటిని కాదని... కంటి చికిత్స నిమిత్తం దేశ రాజధానికే వెళ్లటం గమనార్హం. ఇదే తరహాలో ఇప్పుడు పంటి వైద్యం కోసం ఆయన అక్కడికి వెళ్లినట్టు సమాచారం. సీఎంకు అత్యంత సన్నిహితుడూ, దంత వైద్య నిపుణుడైన ఒక డాక్టర్... ఢిల్లీలో పని చేస్తున్నందున ఆయన వద్ద చికిత్స తీసుకునేందుకే సీఎం హస్తినకు బయల్దేరి వెళ్లినట్టు తెలిసింది. మరోవైపు తన ఆరోగ్య విషయాల గురించి ముఖ్యమంత్రి... తన కుటుంబ సభ్యులతో విధిగా చర్చిస్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కూడా ఆయన ప్రగతి భవన్లో వారితో ప్రత్యేకంగా సమావేశమైనట్టు సమాచారం. గతంలో కంటి ఆపరేషన్ అప్పుడు... కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్, కూతురు, ఎమ్మెల్సీ కవిత... స్వయంగా కేసీఆర్కు దగ్గరుండి వైద్యం చేయించారు. ఇప్పుడు కూడా కుటుంట సభ్యుల సమక్షోంలోనే ఆయన వైద్య పరీక్షలు చేయించుకోనున్నారని వినికిడి.