Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10గేట్లు ఎత్తి నీరు విడుదల
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నాగార్జునసాగర్కు కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతుండటంతో నిండుకుండలా మారింది. ఎగువనున్న కష్ణ నదిపరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం సాగర్ జలాశయానికి 1,30,602 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో డ్యామ్ 10 క్రస్ట్గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 81,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతానికి 590.00 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 312.0450 టీఎంసీలుగా ఉంది. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేపడుతూ 29,557 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడికాలువ ద్వారా 9104 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాలువ ద్వారా 8541 క్యూసెక్కుల నీటిని, ఎస్ఎల్బీసీ ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని మొత్తం 1,30,602 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.