Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు విద్యార్థులకు పాజిటివ్
- రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఘటన
నవతెలంగాణ-కొత్తూరు
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మొత్తం 128 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో కొంతమంది రెండు, మూడ్రోజుల నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయులు స్థానిక ఏఎన్ఎమ్కు సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే సదురు మండల వైద్యాధికారి దేవి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో లక్షణాలు ఉన్న 29 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు ముందులు ఇచ్చి ఇండ్లల్లో క్వారంటైన్ చేశారు. వారి వెంట ఉన్న విద్యార్థులకు కరోనా పట్ల అవగాహన కల్పించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.