Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కుల వివక్షకు వ్యతిరేకంగా సామాజిక పోరాటాలు చేస్తున్న కేవీపీఎస్కు సీఐటీయూ పూర్తి మద్దతు ప్రకటించింది. సీఐటీయూ తరపున లక్ష రూపాయల సంఘీభావ నిధిని అందజేసింది. సోమవారం హైదరాబాద్లో అందుకు సంబంధించిన చెక్కును కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్బాబుకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, ఎం.సాయిబాబు, ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఆఫీస్ బేరర్లు పి.రాజారావు, పాలడుగు భాస్కర్, భూపాల్, జె.వెంకటేశ్, పి.జయలక్ష్మి, ఎస్.రమ, జె.మల్లిఖార్జున్, బి.మధు, వంగూరు రాములు, ఆర్.కోటంరాజు, కళ్యాణం వెంకటేశ్వరరావు, తుమ్మల వీరారెడ్డి, ఎ.ముత్యంరావు, కె.యాదానాయక్, ఎం.వెంకటేశ్, బి.మల్లేశ్, ఎం.పద్మశ్రీ, మంద నర్సింహారావు, జె.చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చుక్కరాములు, ఎం.సాయిబాబు మాట్లాడుతూ..కుల దురంహకార హత్యలకు, కులవివక్షకు వ్యతిరేకంగా కేవీపీఎస్తో కలిసి అనేక పోరాటాలు చేశామన్నారు. కార్మికవర్గం తరపున సీఐటీయూ తన పాత్రను ఎల్లవేళలా పోషించేందుకు సిద్ధంగా ఉందన్నారు. సామాజిక సమస్యలపై సీఐటీయూగా రాబోయే రోజుల్లో ప్రత్యేక క్యాంపెయిన్ చేపడుతామన్నారు.