Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగు రైతులకు పట్టాలివ్వాలి:
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు
- ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ - కోడేరు
హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, సాగులో ఉన్న రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కోడేరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్వ తాలు మాట్లాడుతూ.. మండలంలో అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. మండలంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో వేలాది మందికి ఇండ్లు, ఇండ్ల స్థలాలు, పింఛన్లు, రేషన్ కార్డు లేనట్టు గుర్తించినట్టు చెప్పారు. ప్రజలు వ్యక్తిగత దరఖాస్తులు తీసుకొని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారని, ఈ ధర్నాకు వివిధ గ్రామాల నుంచి పెద్దఎత్తున తరలిరావడమే ఇందుకు నిదర్శన మన్నారు. ఉండియావాల్య నాయక్తండా, జనంపల్లి, రేకులపల్లి తదితర గ్రామాల్లో సాగు రైతులకు పట్టాలివ్వాలన్నారు. బాబాయిపల్లి, తీగలపల్లి, నర్సాయిపల్లి గ్రామాల్లో ముంపునకు గురైన రైతులకు పరిహారం అందజేసి ఆదుకోవాలన్నారు. లేకుంటే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. దీనికి స్పందించిన ఆర్డీఓ హను మానాయక్.. నెల రోజుల్లో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ భూములు పరిశీలన చేసి లబ్దిదారులకు ప్లాట్లు అందజేస్తామని హామీనిచ్చారు. మిగతా సమస్యల గురించి జిల్లా కలెక్టర్కు నివేదిస్తామని తెలిపారు. అంతకుముందు మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యా లయం వరకు ప్రజలు డప్పులు వాయిస్తూ భారీ ర్యాలీ చేశారు. ఆర్డీఓ, తహసీల్దార్ మల్లికార్జునకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతన ఆంజనేయులు, పి.నరసింహ, ప్రజాసంఘాల నాయకులు రమేష్, ఈశ్వర్, పి.రవి, వి.రవి, వి.రాజేష్, పి.రాములు, డి.శివుడు, ఎండి.మాలిక్, వెంకటమ్మ, బుచ్చన్న, సింగంపల్లి శ్రీను, మాచుపల్లి శంకర్, శివశంకర్, వరప్రసాద్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.