Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి - హైదరాబాద్
హైదరాబాద్ నగర పరిధిలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్ల ఫ్లాట్ల లాటరీ తేదీలను హెచ్ ఎం డీ ఏ ప్రకటించింది. ఈ నెల 27,28,29 తేదీల్లో లాటరీ తీయనున్నట్టు శనివారం ఒక ప్రకటనలో హెచ్ ఎం డీ ఏ వెల్లడించింది. ఈనెల 27న పోచారం , 28న బండ్ల గూడ ( త్రిబుల్ బెడ్ రూమ్ డీలక్స్ మినహా ) , 29న బండ్ల గూడ త్రిబుల్ బెడ్ రూమ్ డీలక్స్ ఫ్లాట్ల లాటరీ తీయనున్నారు. మొత్తం 3716 ఫ్లాట్లకు 39082 అప్లికేషన్లు వచ్చినట్టు తెలిపింది. ఇందులో బండ్లగూడకే 33161 అప్లికేషన్లు వచ్చాయి. ఫ్లాట్ల లాటరీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, లాటరీ ని యూట్యూబ్ , ఫేస్ బుక్ లో లైవ్ టెలికాస్ట్ తోపాటు రికార్డ్ చేస్తున్నట్లు లింక్ లను హెచ్ ఎం డీ ఏ ప్రకటించింది.
లాటరీ తీసిన తరువాత ఫ్లాట్ నంబర్ , అప్లికెంట్ నేమ్ వెల్లడిస్తామని తెలిపింది. బండ్లగూడలో 345 త్రిబుల్ బెడ్ రూమ్ డీలక్స్ ఫ్లాట్లకు 16,679 అప్లికేషన్లు వచ్చినందున ఈ లాటరీ ని ఈనెల 29న తీస్తున్నట్టు హెచ్ ఎం డీ ఏ ప్రకటించింది. ఫ్లాట్లు దక్కించుకున్న వారి వివరాలను www.hmda.gov.in , www.swagruha.telangana.gov.in వెబ్ సైట్ లో ఈనెల 29 సాయంత్రం నుంచి అందుబాటులో ఉంచుతామన్నారు. ఒక్క వ్యక్తి ఒకే ఫ్లాట్ అర్హులని, ఒక వేళ రెండు ఫ్లాట్స్ వస్తే రద్దు చేస్తామని వెల్లడించింది. ఫ్లాట్ దక్కించుకున్న వ్యక్తులు వారంలోగా 10 శాతం ఫ్లాట్ అమౌంట్ , మిగతా 80 శాతం అమౌంట్ ను రెండు నెలల్లోగా, మిగతా అమౌంట్ ను 3 నెలల్లోగా చెల్లించాలని హెచ్ ఎం డీ ఏ ప్రకటించింది.