Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రూ టీచర్స్ కోయలేషన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను వెంటనే ప్రకటించాలని ట్రూ టీచర్స్ కోయలేషన్ (టీటీసీ) రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పాపగారి ఆశీర్వాదం, కులేరి ప్రేమ్సాగర్ శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కొన్నేండ్లుగా ఉపాధ్యాయ పదోన్నతులు, నియామకాలు లేకపోవటంతో విద్యా వ్యవస్థ కుంటుపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను ఎందుకు తాత్సారం చేస్తున్నదని ప్రశ్నించారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను టీఆర్టీ ద్వారా నింపాలని డిమాండ్ చేశారు. 'మన ఊరు మన బడ'ి పథకాన్ని అన్ని పాఠశాలలకు వర్తింపజేయలని కోరార.