Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒమిక్రాన్ ఉపవర్గం వ్యాప్తి ఎక్కువ
- యాంటీబాడీలు తగ్గిపోవడమూ కారణమే
- ప్రతి రోజూ 500 వరకు కొత్త కేసులు
- జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్యనిపుణులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రతి రోజూ 500 వరకు నమో దవుతున్నాయి. ఆరు నెలల నుంచి అంతా ముగిసినట్టే అనే నామమాత్రంగా కనిపించిన వైరస్ కొంతకాలంగా వ్యాపిస్తున్నది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగ వంతం చేయడంతో ఇక కరోనా నుంచి బయటపడినట్టేనని అంతా భావిం చారు. అయితే అనూహ్యంగా కొన్ని రోజులుగా పెరుగుతున్న కేసులు ఆందోళ నకు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పాజిటివ్ రేటు రెండు నుంచి మూడు శాతం వస్తుండటం గమనార్హం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఇప్పటికే హెచ్చరించింది. కేసుల పెరుగుదల మరి కొద్ది వారాలపాటు ఇదే విధంగా ఉంటుందని తెలిపింది. కరోనా మహమ్మారి రెండేండ్లలో రకరకాల వేరి యంట్ల రూపంలో వ్యాపిస్తూనే ఉన్నది. మూడో వేవ్లో ఒమిక్రాన్ రూపంలో కరోనా కమ్మేసింది. తాజాగా ఒమిక్రాన్లో సబ్ వేరియంట్లకు వ్యాప్తి చెందే గుణం అధికంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు గతంలో కరోనాకు గురైన వారు, వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైతం తిరిగి ఇన్ఫెక్షన్కు గురవుతారని వైద్య నిపుణులు నిర్దారించారు. కరోనా, వ్యాక్సిన్తో శరీరంలో తయారైన యాంటీ బాడీలు తగ్గిపోవడం కూడా ఇందుకు కారణమని విశ్లేషి స్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో తీవ్రత తక్కువగా ఉంటున్నదనీ, అర్హులైన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తు న్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు వ్యాక్సి న్ తప్పనిసరిగా తీసుకోవాలనీ, ఇతర జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.