Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ పరిధిలో ఘటన
నవతెలంగాణ-గండిపేట్
బహుళ అంతస్తు భవన నిర్మాణ సెల్లార్ మట్టిపెళ్లలు కూలి ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. నార్సింగి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట్ మండలం మణికొండ మున్సిపల్ పుప్పాల్గూడ గ్రామంలోని ఈఐపీఎన్ సంస్థ నిర్మిస్తున్న బహుళ అంతస్తు భవనానికి డబుల్ సెల్లార్ కోసం పనులు చేస్తున్నారు. అకస్మాత్తుగా మట్టి పెళ్లలు కూలిపోయాయి. దీంతో ముగ్గురు వలస కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మట్టి శిథిలాల కింద మరికొందరు ఉన్నట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతులంతా బీహార్ వాసులుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న నార్సింగి ఎస్ఐ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వీరికి మున్సిపల్ అధికారులు సహకారం అందించారు. ఈఐసీఎన్ సంస్థ నిర్మాణ పనుల్లో తీసుకోవాల్సిన కనీస జాగ్రతలు తీసుకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు.