Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాసాని జ్ఞానేశ్వర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగుదేశం తెలంగాణ శాఖ పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్ష సోమవారం నిర్వహించారు. ఆ పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో చేపట్టారు. ఈ సమావేశానికి సికిం ద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు పి సాయిబాబా, మల్కాజి గిరి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు అశోక్ కుమార్ గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు సుభాష్ యాదవ్, నల్లగొండ పార్ల మెంట్ నియో జకవర్గ అధ్యక్షులు నెల్లూరు దుర్గాప్రసాద్తో ఆయా అంశాలపై చర్చించారు. ఈ సందర్భం గా డిసెంబర్ 21న హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు చేపట్టనున్న ర్యాలీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు పాల్గొననున్నారని తెలిపారు. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని లోక్సభ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులకు సూచించారు.