Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబాలతో సహా...
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ తెలుగుదేశం నేతలు హాజరు కావాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆ పార్టీ కేంద్ర కమిటీ నుంచి ఆహ్వానాలు అందాయి. టిటిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్రెడ్డి, పొలిట్బ్యూరో సభ్యులు, టిడిఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర కమిటీ కోరినట్టు సమాచారర. శంకుస్థాపన కార్యక్రమానికి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, మూడు దేశాల ప్రధానమంత్రులను ఆహ్వానించిన విషయం విదితమే. దాదాపు పది లక్షల మంది వరకు ఇందులో భాగస్వాముల్నీ చేయాలని సంకల్పించారు. ఇదిలావుంటే కొంత మంది కీలకనాయకులు, ఎమ్మెల్యేలు తమ కుటుంబాలతో సహా అమరావతి వెళ్లాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు. అమరావతి నిర్మాణం ఎపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మై బ్రిక్-మై అమరావతి' కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కొంత మంది నేతలు అనుకుంటున్నారు. ఆన్లైన్లో ఇటుకలను కొని అమరావతికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఒక్కో ఇటుకకు రూ.10 కనీస ధరగా ఎపి సర్కారు ఖరారు చేసింది.