Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఎం.ఓంకార్ 7వ వర్థంతి ఈనెల 17న హైదరాబాద్లో నిర్వహించనున్నట్టు భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ(ఐక్య) రాష్ట్ర కార్యదర్శి ఎం.డి.గౌస్ తెలిపారు. ఈ సందర్భంగా బిసిలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కావాలని కోరుతూ రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఓంకార్ వర్థంతి సందర్భంగా ఈనెల 17 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆయా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. రాష్ట్ర సదస్సు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుందన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, మాజీ హైకోర్టు న్యాయయూర్తి జస్టీస్ చంద్రకుమార్, పది వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులు, మేధావులు హాజరవుతారని వివరించారు.