Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ముట్టడిలో రైతు నాయకులు నర్సింహారెడ్డ్డిి
నవ తెలంగాణ - మహబూబ్నగర్ కలెక్టరేట్
సీడ్ పత్తి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ సోమవారం మహబూబ్నగర్ కలెక్టరేట్ ముట్టడి జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులు నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తమను ఆదుకోవాల న్నారు. గద్వాల, మల్దకల్, అయిజ, గట్టు, ధరూర్, ఇటిక్యాల మండలాల్లో 25 వేల మంది రైతులు 50 వేల ఎకరాల్లో సీడ్ పత్తిని సాగు చేశారని తెలిపారు. సీడ్ పత్తికి ఎర్రతెగులు సోకి ఒక్కో రైతు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల మేర నష్టపోయినట్టు పేర్కొన్నారు. నష్టపోయిన ఒక్కో రైతుకు రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట నష్టాన్ని పరిశీలించేందుకు గత నెల 24న వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు, కంపెనీల ప్రతినిధులు, రైతు సంఘాలతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించిప్పటికీ అన్నదాతలకు చేసిందేమీ లేదన్నారు. ఈ కమిటీ నుండి కంపెనీ ప్రతినిధులను తొలగించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలన్నీ పరిష్క రించేందుకు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి పరిహారం అందించేందుకు కమిటీ కృషి చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో నకిలీ కంపెనీలు రైతులను మోసం చేస్తూ విత్తనాలి స్తున్నాయని, తగు జాగ్రత్తలు చెప్పకపోవడంతో రైతులు నిండా మునిగారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాల్ విత్తనాలకు లక్ష రూపాయలివ్వాలన్నారు. కంపెనీల యజమా నులు దళారులతో కాకుండా నేరుగా రైతులతోనే అగ్రిమెంటు చేసుకుని విత్తనాలివ్వాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు.