Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - యంత్రాంగం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కన్గుట్ట గ్రామ రైతు ప్రవీణ్(22) తన రెండెకరాలతో పాటు ఆరెకరాలు కౌలుకు తీసుకొని సోయా, పత్తి సాగు చేశాడు. వర్షాల్లేక పంటలు ఎండిపోయాయి. దీంతో మనస్థాపానికి గురైన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ప్రవీణ్ తండ్రి పేరు మీద బ్యాంకు అప్పు, ప్రయివేటు అప్పు కలిపి రూ. 5.50 లక్షలున్నట్టు సమాచారం. మహబూబ్నగర్ జిల్లా వెల్దండ మండలం పోతెపల్లి గ్రామానికి చెందిన రైతు ఎనుముల తిరుపతయ్య(30) తన ఆరెకరాల భూమిలో పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. వర్షాభావం కారణంగా పంటలు పూర్తిగా ఎండిపోయాయి. అయితే పంట పెట్టుబడికి రూ. 4 లక్షల అప్పులయ్యాయి. దీంతో అప్పు తీర్చే మార్గం లేక మనస్థాపంతో బుధవారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు తిరుపతయ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి మృతి చెందాడు.