Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-14 మందిపైన కేసు
- వివరాలు వెల్లడించిన డిఎస్పి
నవతెలంగాణ-తూప్రాన్
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దుర్మార్గులను అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు పంపారు. బాధితురాలి శీలానికి వెలకట్టిన 14 మంది గ్రామపెద్దలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి తూప్రాన్ డిఎస్పి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన బాలిక(17) తన అక్క గ్రామమైన శివ్వంపేట మండలం పాంబండకు వెళ్లింది. ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో సోమవారం ఉదయం 08:30 గంటలకు పాడుబడ్డ బావి వద్దకు బహిర్భూమికి వెళ్లింది. అటుగా వచ్చిన గ్రామానికి చెందిన ప్రభాకర్, చింతకాడి బాల్రాజు లైంగికదాడి చేశారు. బాలిక చున్నీని మెడకు చుట్టి ఇరువైపులా లాగి గొంతును నులిమారు. వీపుపై తీవ్రంగా గాయపరిచారు. విషయం ఎవరికైనా చెబితే ప్రాణం తీస్తామని బెదిరించి బాలికను అక్కడే వదిలేసి పరారయ్యారు. కొంతసేపటికి తేరుకున్న బాలిక ఇంటికి వచ్చి మామ ఎల్లయ్యకు విషయం చెప్పింది. ఎల్లయ్య తన కులస్తులకు సమాచారమందించాడు. బాలిక నింది తులను గుర్తుపట్టడంతో ఈనెల 3న పంచాయితీ పెట్టారు. గ్రామపెద్దలు సర్పంచ్ విష్ణువర్ద్ధన్రెడ్డి, మాజీ సర్పంచ్ శేఖర్గౌడ్, రేషన్ డీలర్ శంకర్, తలారి శివుడు, మన్నె నాగమయ్య, తూప్రాన్ భిక్షపతి, పెద్దగొల్ల పోచయ్య, దుబ్బ నాగరాజు, జుక్కమల్లు సాయిలు, బక్కి నాగయ్య, చింతకాడి మల్లయ్య, చింతకాడి భూమయ్య, జెశ్వంత్, చింతకాడి శేఖర్తో పాటు మరికొంత మంది కలిసి బాలిక శీలానికి వెలకట్టారు. నష్టప రిహారంగా రూ.లక్ష ఇప్పిస్తామని తీర్మానించారు. ఈ విషయమై 4న శివ్వం పేట పోలీస్స్టేషన్లో బాధితురాలు, బంధువులు ఫిర్యాదు చేశారు. శివ్వం పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని తూప్రాన్ సిఐ రమేశ్బా బుకు సమా చారమందించారు. డిఎస్పి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిందితులిద్దరినీ రిమాండ్కు తరలించి గ్రామపెద్దలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టా రు. సమావేశంలో సిఐ రమేశ్ బాబు, ఎస్ఐ వెంకటేశ్, సిబ్బంది ఉన్నారు.