Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అన్ని మతాలకు సమాన గౌరవం, అన్ని పండగలకు సమాన గుర్తింపు లభించాలన్నదే తన అభిమత మని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వా త బతుకమ్మ, బోనాలు, రంజాన్, గురునానక్ జయం తులు అధికారికంగా, ఘనంగా నిర్వహించామని, ఇప్పుడు క్రిస్మస్ వేడుకలను కూడా గొప్పగా జరపాలని సీఎం అధికా రులను ఆదేశించారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణపై మంగళ వారం సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీనియర్ అధికారులు ఏకే.ఖాన్, రేమాండ్ పీటర్, ఉమర్ జలీల్, ఆధార్ సిన్హా, భూపాల్రెడ్డి తదితరులు సమీ క్షలో పాల్గొ న్నారు. తెలంగాణలో మత సామరస్యం, శాంతి వెల్లువిరి యాలని, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతకాలని సీఎం ఆకాంక్షించారు. అందుకోసం అన్ని మతాల పండగలను ప్రభుత్వ పండగలు గానే గుర్తిస్తున్నామని వెల్లడిం చారు. క్రిస్మస్ పండగ సందర్భంగా రాష్ట్రంలోని 195 కేంద్రాల్లో క్రిస్టి యన్లకు ఈనెల 16న దుస్తులు పంపిణీ చేయాలని, 19న క్రిస్మస్ విందు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిం చారు. 20న రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్లో అధికారిక కార్యక్రమం ఏర్పాటు చేయాలని, దానికి తాను హాజరవుతానని సీఎం ప్రకటించారు.